Friday, May 10, 2024
- Advertisement -

కొత్త ఇళ్లు కట్టుకొంటున్న జగన్!: టీడీపీ ఏమంటుందో

- Advertisement -

ఇప్పటికే జగన్ నివాసం గురించి తెలుగుదేశం పార్టీ అనేక రకాలుగా ధ్వజం ఎత్తింది. హైదరాబాద్ లో, బెంగళూరుల్లో ఉన్న ఇళ్ల గురించి తెలుగుదేశం వాళ్లు లెక్కలేనని విమర్శలు చేశారు.

జగన్ మోహన్ రెడ్డి ఇంట్లో అన్ని గదులున్నాయి.. ఇన్ని గదులున్నాయి.. వాటిల్లో హెలిప్యాడ్ లున్నాయి.. అంటూ వీరు ధ్వజమెత్తారు. జగన్ పై విమర్శలు చేసిన తెలుగుదేశం నేతల ఇళ్లేమీ చిన్నవి కాకపోయినా.. వాళ్ల ఇళ్లు కూడా పెద్ద పెద్దవే అయినా.. వాళ్లు విమర్శలు చేయడానికి వెనుకాడలేదు. మరి ఆ సంగతంతా అలా ఉంటే.. ఇప్పుడు జగన్ ఇంటి గురించి మళ్లీ తెలుగుదేశం పార్టీ విమర్శలు ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఎందుకంటే.. జగన్ మోహన్ రెడ్డి అమరావతిలో కొత్తగా ఇళ్లు నిర్మించుకోవాలని భావిస్తున్నాడు. ప్రతిపక్ష నేతగా జగన్ అక్కడ ఇళ్లు కట్టుకోవాలని అనుకొంటున్నట్టుగా తెలుస్తోంది. ఒకవైపు ముఖ్యమంత్రి అమరావతి ఏరియాలో ఇంటిని నిర్మించుకోగా… ఏపీకి సంబంధించిన ఇతర ప్రజాప్రతినిధులు కూడా ఎవరికి వారుగా అక్కడ సెటిలవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ప్రభుత్వ పరిణామాలను గమనించాల్సిన ప్రతిపక్ష నేత కూడా అక్కడే మకాం పెట్టాల్సి ఉంటుంది. అందులో భాగంగా జగన్ మోహన్ రెడ్డి కొత్తింటిని నిర్మించుకోవాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.

సంక్రాంతి కళ్లా జగన్ మోహన్ రెడ్డి అమరావతి, విజయవాడ ఏరియాకు షిఫ్ట్ అయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అంతలోపు ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసి జగన్ కుటుంబ సమేతంగా అక్కడికి షిఫ్ట్ కానున్నారని సమాచారం. మరి ఒకవైపు ముఖ్యమంత్రి.. మరోవైపు ప్రతిపక్ష నేత కూడా హైదరాబాద్ ను ఖాళీ చేసి అక్కడకు వెళ్లిపోతే ఏపీ వ్యవహారాల్లో హైదరాబాద్ ప్రస్తావన తగ్గిపోతుందేమో!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -