Saturday, May 4, 2024
- Advertisement -

2019 ఎన్నిక‌ల్లో క‌ర్నూల జిల్లాలో క్లీన్ స్వీప్ చేసేందుకు జ‌గ‌న్ మాస్ట‌ర్ ప్లాన్‌

- Advertisement -
YS Jagan master plan to clean sweep in Kurnool dist for 2019 election

వ‌చ్చె ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ అధికారంలోకి రావ‌డానికి ఉన్న అన్ని మార్గాల‌ను ఉప‌యేగించుకొనేందుకు ప్ర‌ణాలిక‌లు రూపొందిస్తున్నారు. రాయ‌ల‌సీమ‌లో వైసీపీకి చెక్ పెట్టాల‌ని చూస్తున్న బాబుకు ఇప్పుడు చుక్కులు క‌నిపించ‌నున్నాయి.ప్ర‌ధానంగా ప‌ట్టున్న క‌ర్నూలు జిల్లాలో ఉన్న సీట్ల‌న్ని క్లీన్ స్వీప్ చేసేందుకు జ‌గ‌న్ ప‌ద్మ‌వ్యూహాన్ని ఏర్పాటు చేస్తున్నారు.

ప‌త్తికొండ వైసీపీ ఇంఛార్జ్ నారాయ‌ణ రెడ్డి దారుణ హ‌త్య త‌ర్వాత‌… జిల్లాలో వైసీపీ వేగం పెంచింది. ఈ సారి ఏ సీటు కూడా టీడీపీకి ద‌క్క‌నివ్వ‌కుండా పావులు కదుపుతోంది. అందుకే ఇప్ప‌టినుంచే ద‌మ్మున్న‌, ధీటైన అభ్య‌ర్థుల కోసం క‌స‌ర‌త్తు ప్రారంభించింది. అసెంబ్లీ స్థానాలు మాత్ర‌మే కాదు.. అటు ఎంపీ సీట్ల‌కు స్ట్రాంగ్ క్యాండిడేట్ల‌ను నిలిపేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసింది.

{loadmodule mod_custom,GA1}

క‌ర్నూలు జిల్లాలో వైసీపీకి బ‌లంగా ఉన్న భూమా వ‌ర్గం టీడీపీలో చేర‌డంతో వైసీపీ బ‌ల‌హీన ప‌డింద‌న‌డంలో సందేహంలేదు. అయితే ఆ లోటును గంగుల బ్ర‌ద‌ర్స్‌ ఎంట్రీతో భ‌ర్తీ చేసింది వైసీపీ. నంద్యాల‌లో గంగుల ప్ర‌భాక‌ర్ రెడ్డికి బెర్త్ ఖాయం అయింది. అటు వ‌చ్చే ఎల‌క్ష‌న్‌లోనూ ఇదే సీన్ ఉంటుంది. కొడుమూరులో ముర‌ళీకృష్ణ‌, క‌ర్నూలు టౌన్‌లో హ‌ఫీజ్ ఖాన్‌, నంద్యాల‌లో రాజ‌గోపాల్‌రెడ్డిలు ఉండ‌నే ఉన్నారు.
2019 ఎన్నిక‌ల్లో ఎమ్మిగ‌నూరు నుంచి పోటీ చేసేందుకు ఆస‌క్తి చూపుతున్నారు ఎంపీ బుట్టా రేణుక‌. ఆ నియోజ‌కవ‌ర్గంలో త‌న సామాజిక వ‌ర్గమైన ప‌ద్మశాలి ఓట‌ర్లు అధికంగా ఉండటంతో అదే బెస్ట్ ప్లేస్‌గా చూస్తున్నారు. మ‌రోవైపు మాజీ కేంద్ర‌మంత్రి కోట్ల సూర్య‌ప్ర‌కాశ్ రెడ్డి పార్టీలోకి వ‌చ్చే అవ‌కాశం ఉండ‌టంతో ఆయ‌న‌కు క‌ర్నూలు ఎంపీ స్థానం కేటాయించొచ్చ‌ని చెబుతున్నారు.
అటు నంద్యాల ఎంపీ స్థానం నుంచి ఓ సీనియ‌ర్ నేత‌… ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్య‌క్తికి టిక్కెట్ ద‌క్కొచ్చ‌ని వైసీపీ వ‌ర్గాల స‌మాచారం. ఇక ప‌త్తికొండ స్థానం నారాయ‌ణ రెడ్డి స‌తీమ‌ణి… శ్రీదేవికి ఇస్తున్న‌ట్లు వైఎస్ జ‌గ‌న్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు.

{loadmodule mod_custom,GA2}

క‌ర్నూలు జిల్లాలో ఎటు చూసినా వైసీపీ బ‌లంగా క‌నిపిస్తోంది.అటు జిల్లా అధ్య‌క్షుడు గౌరు వెంక‌ట్ రెడ్డి… అంద‌రిని క‌లుపుకొని పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. ఎన్న‌క‌ల‌కు ముందుగానే జ‌గ‌న్ క‌ర్నూలుపై ప‌ట్టు సాధించేందుకు ప్లాన్ అమ‌లు చేస్తున్నారు.ముందుగాల‌నే అయా నియేజ‌క వ‌ర్గాల అభ్య‌ర్థుల‌ను ఇప్ప‌టి నుంచే స‌మాయాత్తం చేస్తున్నారు. క‌ర్నూలును క్లీన్ స్వీప్ చేసేందుకు జ‌గ‌న్ కృషిచేస్తున్నారు.

{loadmodule mod_sp_social,Follow Us}

Related

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -