Tuesday, May 21, 2024
- Advertisement -

పాపం రోజా

- Advertisement -

వైసీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే.. జబర్దస్త్ పొలిటికల్ లేడీ రోజాను.. కష్టాలు వెంబడిస్తున్నాయి. గడిచిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా జరిగిన గొడవతో.. ఆమె సభ నుంచి ఏడాది పాటు సస్పెండ్ అయిన విషయం తెలిసిందే. ఈ ఇష్యూపై లీగల్ గా ఫైట్ చేస్తున్న రోజాకు.. ఇప్పట్లో సమస్య సాల్వ్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు.

ఆమె వేసిన పిటిషన్ సుప్రీం కోర్టులో.. వాయిదా పడడంతో ఎప్పటికి తన సమస్య తీరుతుందో అర్థం కాక రోజా అయోమయానికి గురవుతున్నారట. వాస్తవానికి ఆమె వేసిన పిటిషన్… సుప్రీంలో విచారణకు వచ్చింది. కానీ..  న్యాయమూర్తి మాత్రం.. తను ఆ కేసును విచారించలేనని వాయిదా వేశారు. తను కాకుండా వేరే జడ్జి ఈ విషయాన్ని ఎంక్వైరీ చేస్తారంటూ… సోమవారానికి పోస్ట్ పోన్ చేశారు.

ఓ వైపు.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నడుస్తున్నాయి. మరోవైపు.. తనపై ఏడాది నిషేధం కారణంగా సభకు రోజా హాజరుకాలేకపోతున్నారు. ఇది.. వైసీపీకి కూడా ఓ రకంగా ఇబ్బందిగా మారింది. సభలో జగన్ వన్ మాన్ షో కు.. వైసీపీ నుంచి సపోర్ట్ లేకుండా పోతోంది. అందుకే.. రోజా కూడా వీలైనంత త్వరగా తనపై నిషేధాన్ని ఎత్తేయించి.. సభలో అడుగుపెట్టాలని ఆరాటపడుతున్నారు. కానీ.. కాలం కలిసి రాక.. కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. అందుకే.. అయ్యో పాపం రోజా! అంటూ అంతా జాలిపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -