- Advertisement -
వైయస్ఆర్సిపి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏపి ప్రభుత్వ అధికారులకు వార్నింగ్ ఇచ్చారు.
ఇప్పుడు ఉన్న టిడిపి గవర్నమెంట్ చెప్పిన విధానం ప్రకారం అధికారులు పని చేస్తున్నారు. మీ పని మీరు సరిగ్గా నిర్వర్తించడం లేదు. టిడిపి కార్యకర్తలకు సపోర్టర్స్గా ముందుకు వెళ్తున్నారు. ప్రజలకు ఉపయోగ పడే విదంగా పని చేయటం లేదు. దీనిని ప్రజలు గమనిస్తున్నారని, బుద్ది చెబుతారని చెవిరెడ్డి అధికారులకు సూచించారు. వచ్చేది వైయస్ఆర్సిపి గవర్నమెంటేనని, ఈ విషయం అధికారులు గుర్తుపెట్టుకోవాలన్నారు. పార్టీలతో సంబందం లేకుండా అధికారులు పని చేయాలన్నారు. అప్పుడే ప్ర్రజలకు మేలు జరుగుతుందని చెవిరెడ్డి పేర్కొన్నారు.
