నంద్యాల ఉప ఎన్నికలో గెలుపు కోసం మంత్రి అఖిల ప్రియ నానా వస్తలు పడుతున్నారు. ఇప్పటికే వైసీపీ అభ్యర్తి గెలుపు ఖాయమనే నేపథ్యంలో చివరిసారిగా పవర్పుల్ అస్త్రాన్ని ప్రయేగిస్తున్నారు. ఒకవైపు ప్రజలను మభ్యపెడుతూనె మరో వైపు సానుభూతి కోసం ప్రయత్నాలు చేస్తోంది.
నంద్యాలలో వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న శిల్పా మోహన్ రెడ్డి వల్ల భూమా నాగిరెడ్డి కుటుంబం బాగా ఇబ్బందులు పడిందట. నాగిరెడ్డి మరణం తర్వాత శిల్సా తమ కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేసినట్లు మంత్రి భూమా అఖిలప్రియ ఆరోపించారు. ఎన్నికల సమయంలో మంత్రి ఈ విధంగా చెప్పటం కాస్త విచిత్రంగానే ఉంది.
ఎన్నికల్లో సానుభూతి ద్వారా ఓట్లు సంపాదించుకునే ప్రయత్నంలాగే ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే, శిల్పా తమ కుటుంబాన్ని ఇబ్బందులు పెట్టారని చెబుతున్నారే గానీ ఏ విధంగా అని మాత్రం చెప్పలేదు. పైగా శిల్పా, భూమా ఇద్దరూ అధికారపార్టీలో ఉన్నపుడు ఇక శిల్పా, అఖిల కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేసేదేముంటుంది? భూమా నాగిరెడ్డి మరణించిన దగ్గర నుండి నంద్యాలలో పోటీ చేసేందుకు పొరాటం చేయటంతోనే శిల్పా కు సమయం సరిపోయింది.
అఖిల కుంటుంబాన్ని ఇబ్బందులకు గురిచేసుంటె …చంద్రబాబు ఏంచేస్తున్నాట్లు. ఎవరూ పట్టించు కుటుంబాన్ని గాలికొదిలేసినట్లేనా..? మోహన్ రెడ్డి ఇబ్బందులు పెట్టినా చక్రపాణిరెడ్డిని గెలిపించామని అఖిల చెప్పటంలో అర్ధమేలేదు. ఎందుకంటే, పార్టీ అభ్యర్ధిగా చక్రపాణిరెడ్డి గెలుపుకు భూమా కుంటుంబం పనిచేసి ఉండవచ్చు. మోహన్ రెడ్డి ఇబ్బందులు పెట్టటానికి చక్రపాణిరెడ్డి గెలుపుకు పనిచేయటానికి సంబంధమే లేదు.
అయినా ఇప్పుడే అవిషయాలు ఎందుకు గుర్తు చేస్తున్నారనేది ప్రశ్నగా మారింది. అంటే సానుభూతికోసమే అని చెప్పట తప్పదు. పైగా మోహన్ రెడ్డికి ఓట్లేస్తే అభివృద్ధిని అడ్డుకుంటారని జనాలు అనుకుంటున్నారట. నిజంగా మంత్రి భలే జోకులేస్తున్నారు.
https://www.youtube.com/watch?v=rbWEAZ9i9o8