ఏపీ నీటి పారుదలశాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. ఇవాళ మీడియా ముందుకొచ్చి.. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ పై నిప్పులు చెరిగాడు. మామూలుగా కాదు.. ఓ రేంజ్లో విరుచుకుపడ్డాడు. ఇటీవల లోకేశ్ బాబు కొంచెం గెటప్ చేంజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రోజూ జూమ్ మీటింగ్లోకి వచ్చి.. సీఎం జగన్, ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ఇటీవల పోలవరం పై కూడా ఆరోపణలు చేశారు లోకేశ్. మరోవైపు పొలవరంపై ఆర్ఆర్ఆర్ అదేనండి వైసీపీ రెబల్ ఎంపీ సైతం ఢిల్లీ వెళ్లి ఫిర్యాదులు గుప్పించాడు.
ఈ క్రమంలో మంత్రి అనిల్ మీడియా మందుకు వచ్చి.. అందరికీ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేశాడు. ఆయన ప్రెస్ మీట్ తొలుత కొద్ది నెమ్మదిగా సాగింది. పొలవరం పనుల గురించి వివరించారు. ఆతర్వాత చినబాబు, పెదబాబు ఎవ్వరినీ వదలకుండా ఓ రేంజ్లో మాటల దాడికి దిగారు మంత్రి…ఇంతకీ ఆయన ఏమన్నారంటే.. ‘ పొలవరం ప్రాజెక్టును పూర్తిచేయడానికి అధికారులు అహర్నిశలు కృషిచేస్తున్నారు. వయసుతో పనిలేకుండా అన్ని విభాగాల వారు ఈ ప్రాజెక్టు కోసం పనిచేస్తున్నారు. త్వరలోనే ప్రాజెక్టు పూర్తి కావడం ఖాయం. కానీ టీడీపీ నేతలు మాత్రం ఈ విషయం అస్సలు పట్టడం లేదు. పొలవరం ప్రాజెక్టును దివంగత నేత రాజశేఖర్రెడ్డి ప్రారంభించారు. ఆ ప్రాజెక్టును జగన్ మోహన్రెడ్డి పూర్తిచేస్తారు.
Also Read: ఇలా అయితే కష్టం..! చంద్రబాబు, లోకేశ్పై క్యాడర్ నిరుత్సాహం
పొలవరం పూర్తయితే తమకు పుట్టగతులు ఉండవన్న కారణంతో లోకేశ్ జూమ్ మిటింగ్లో విష ప్రచారానికి దిగుతున్నాడు. ఆయన తాత ముఖ్యమంత్రి, తండ్రి ముఖ్యమంత్రి అయినప్పటికీ లోకేశ్ బాబు మాత్రం కనీసం ఎమ్మెల్యేగా గెలవలేకపోయాడు. ఇక ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్సీ పదవి సైతం రేపో మాపో ఊడిపోవడం ఖాయం. ఇప్పుడు ఇక ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఈ రాష్ట్రానికి ప్రతిపక్ష నేత పక్క రాష్ట్రంలో ఇళ్లు కట్టుకొని అక్కడ దాక్కొన్నాడు. కనీసం ప్రజలను పట్టించుకోవడం లేదు. ఇటువంటి వ్యక్తి ప్రజల కోసం పనిచేస్తున్న ముఖ్యమంత్రిని తిట్టడం సిగ్గుచేటు.
కరోనా పేరు చెప్పి.. లోకేశ్, చంద్రబాబు హైదరాబాద్లో దాక్కొన్నారు. మీడియాను అడ్డుపెట్టుకొని డ్రామాలు ఆడుతున్నారు.లోకేశ్ బాబు .. సీఎం జగన్ పట్టుకొని అమూల్ బేబీ అంటాడా? మరి మేము లోకేశ్ను ఏమనాలి. ఆయనను పప్పు అని అంటున్నారు. మేం అనడం లేదు.. జగన్ బాబు అమూల్ బేబీ అయితే.. లోకేశ్ హెరిటేజ్ దున్నపోతేమో’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు అనిల్.
పచ్చ మీడియా ఏకపక్షంగా వ్యవహరిస్తుందని ఆయన మండిపడ్డారు. గతంలో చంద్రబాబుకు ఢిల్లీ నేతలు అనుమతులు ఇవ్వకపోతే ఆత్మగౌరవం దెబ్బతిందని రాసిన మీడియా.. ఇప్పుడేమో సీఎం జగన్కు ఒక్కరోజు అపాయింట్ మెంట్ దొరకకపోతే తగిన శాస్తి జరిగిందని శునకానందం పొందుతున్నదన్నారు. ఇంత నీచమైన మీడియా ప్రపంచంలో ఎక్కడా లేదని మండిపడ్డారు.
Also Read: సోనూసూద్ .. మరో సంచలన నిర్ణయం