Thursday, April 25, 2024
- Advertisement -

లోకేశ్​ నిన్ను హెరిటేజ్​ దున్నపోతు అనాలా?

- Advertisement -

ఏపీ నీటి పారుదలశాఖ మంత్రి అనిల్​ కుమార్​ యాదవ్​.. ఇవాళ మీడియా ముందుకొచ్చి.. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్​ పై నిప్పులు చెరిగాడు. మామూలుగా కాదు.. ఓ రేంజ్​లో విరుచుకుపడ్డాడు. ఇటీవల లోకేశ్​ బాబు కొంచెం గెటప్​ చేంజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రోజూ జూమ్​ మీటింగ్​లోకి వచ్చి.. సీఎం జగన్​, ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ఇటీవల పోలవరం పై కూడా ఆరోపణలు చేశారు లోకేశ్​. మరోవైపు పొలవరంపై ఆర్​ఆర్​ఆర్​ అదేనండి వైసీపీ రెబల్ ఎంపీ సైతం ఢిల్లీ వెళ్లి ఫిర్యాదులు గుప్పించాడు.

ఈ క్రమంలో మంత్రి అనిల్​ మీడియా మందుకు వచ్చి.. అందరికీ లెఫ్ట్ అండ్​ రైట్​ ఇచ్చేశాడు. ఆయన ప్రెస్​ మీట్​ తొలుత కొద్ది నెమ్మదిగా సాగింది. పొలవరం పనుల గురించి వివరించారు. ఆతర్వాత చినబాబు, పెదబాబు ఎవ్వరినీ వదలకుండా ఓ రేంజ్​లో మాటల దాడికి దిగారు మంత్రి…ఇంతకీ ఆయన ఏమన్నారంటే.. ‘ పొలవరం ప్రాజెక్టును పూర్తిచేయడానికి అధికారులు అహర్నిశలు కృషిచేస్తున్నారు. వయసుతో పనిలేకుండా అన్ని విభాగాల వారు ఈ ప్రాజెక్టు కోసం పనిచేస్తున్నారు. త్వరలోనే ప్రాజెక్టు పూర్తి కావడం ఖాయం. కానీ టీడీపీ నేతలు మాత్రం ఈ విషయం అస్సలు పట్టడం లేదు. పొలవరం ప్రాజెక్టును దివంగత నేత రాజశేఖర్​రెడ్డి ప్రారంభించారు. ఆ ప్రాజెక్టును జగన్​ మోహన్​రెడ్డి పూర్తిచేస్తారు.

Also Read: ఇలా అయితే కష్టం..! చంద్రబాబు, లోకేశ్​పై క్యాడర్​ నిరుత్సాహం

పొలవరం పూర్తయితే తమకు పుట్టగతులు ఉండవన్న కారణంతో లోకేశ్​ జూమ్​ మిటింగ్​లో విష ప్రచారానికి దిగుతున్నాడు. ఆయన తాత ముఖ్యమంత్రి, తండ్రి ముఖ్యమంత్రి అయినప్పటికీ లోకేశ్​ బాబు మాత్రం కనీసం ఎమ్మెల్యేగా గెలవలేకపోయాడు. ఇక ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్సీ పదవి సైతం రేపో మాపో ఊడిపోవడం ఖాయం. ఇప్పుడు ఇక ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఈ రాష్ట్రానికి ప్రతిపక్ష నేత పక్క రాష్ట్రంలో ఇళ్లు కట్టుకొని అక్కడ దాక్కొన్నాడు. కనీసం ప్రజలను పట్టించుకోవడం లేదు. ఇటువంటి వ్యక్తి ప్రజల కోసం పనిచేస్తున్న ముఖ్యమంత్రిని తిట్టడం సిగ్గుచేటు.

కరోనా పేరు చెప్పి.. లోకేశ్​, చంద్రబాబు హైదరాబాద్​లో దాక్కొన్నారు. మీడియాను అడ్డుపెట్టుకొని డ్రామాలు ఆడుతున్నారు.లోకేశ్​ బాబు .. సీఎం జగన్​ పట్టుకొని అమూల్​ బేబీ అంటాడా? మరి మేము లోకేశ్​ను ఏమనాలి. ఆయనను పప్పు అని అంటున్నారు. మేం అనడం లేదు.. జగన్​ బాబు అమూల్​ బేబీ అయితే.. లోకేశ్​ హెరిటేజ్​ దున్నపోతేమో’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు అనిల్​.

పచ్చ మీడియా ఏకపక్షంగా వ్యవహరిస్తుందని ఆయన మండిపడ్డారు. గతంలో చంద్రబాబుకు ఢిల్లీ నేతలు అనుమతులు ఇవ్వకపోతే ఆత్మగౌరవం దెబ్బతిందని రాసిన మీడియా.. ఇప్పుడేమో సీఎం జగన్​కు ఒక్కరోజు అపాయింట్​ మెంట్​ దొరకకపోతే తగిన శాస్తి జరిగిందని శునకానందం పొందుతున్నదన్నారు. ఇంత నీచమైన మీడియా ప్రపంచంలో ఎక్కడా లేదని మండిపడ్డారు.

Also Read: సోనూసూద్​ .. మరో సంచలన నిర్ణయం

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -