- Advertisement -
ప్రత్యేకహోదా కోసం వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకు వారి రాజీనామాలు ఆమోదం పొందలేదు. అయితే వారి రాజీనామాలా ఆమోదంపై చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.
వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుల రాజీనామాలను జూన్ 2వ తేదీ తర్వాత ఆమోదించే అవకాశం ఉదని చెప్పారు. బాబు చెప్పేదాంట్లో నిజం లేకపోలేదు. కర్నాటక ఎన్నికలు అయిపోయిన వెంటనే వైసీపీ ఎంపీల రాజీనామాలు లోక్సభస్పీకర్ ఆమోదిస్తారనడంలో సందేహంలేదు.
ఎంపీల రాజీనామాలు ఆమోదిస్తే ఎన్నికలు రావడం కాయం. లోకసభ స్థానాలకు ఉప ఎన్నికలు వస్తే తడాఖా చూపుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో ఓసారి 25 స్థానాలకు ఉప ఎన్నికలు వస్తే టీడీపీ ఏడు స్థానాలు గెలుచుకుందని బాబు గుర్తు చేశారు. మరి వైసీపీ ఎన్నికల్లో నిలబడుతుందా అన్నది తేలాల్సి ఉంది.