ఎక్కడ ఎన్నికలు జరిగినా ప్రజల నాడిని పట్టడంలో లగడపాటి రాజగోపాల్ స్టయిలే వేరు. సర్వేల రారాజుగా లగడపాటికి మంచి పేరుంది. అమరావతిలో బాబును రెండు మూడు సార్లు కలిశారు రాజగోపాల్. అంతె త్వరలోనె టీడీపీ తీర్థం పుచ్చుకుంటారనె వార్తలు వైరస్లాగా వ్యాపించాయి. అయితే బాబును కలసిన సమయంలో 2019 ఎన్నికల్లో పార్టీ పరిస్థితిపై సర్వే రిపోర్టును బాబుకు అందించారనె వార్తలు ఇప్పుడు వైరల్గా మారాయి. ఆ రిపోర్ట్ను చూసి బాబు షాకింగ్కు గురయ్యారంట. ఎన్నకిలు ఎప్పుడు జరిగినా విజయం తమదేనని చెప్పుకొనె బాబుకు సర్వే రిపోర్ట్ను చూస్తానె గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయ్యిందనె వార్తలు వినిపిస్తున్నాయి.
చంద్రబాబుతో లగడపాటి లగడపాటి రాజగోపాల్ ఇటీవల రెండుమూడుసార్లు చంద్రబాబు నాయుడును కలిసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో వారి మధ్య ఏం జరిగిందనేది చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో ఆయా నియోజకవర్గాల్లో టిడిపి పరిస్థితి, ఎమ్మెల్యేల పరిస్థితిపై ఎప్పటికప్పుడు లగడపాటి.. చంద్రబాబుకు నివేదిక ఇస్తున్నారని భావిస్తున్నారు.
చంద్రబాబుకు లగడపాటి షాకింగ్ సర్వే రిపోర్ట్ పలువురు టిడిపి ఎమ్మెల్యేల పనితీరుపై గతంలోను చంద్రబాబుకు లగడపాటి సర్వే రిపోర్ట్ ఇచ్చారని అంటున్నారు. తాజాగా మరోసారి ఆయన సర్వే రిపోర్ట్ ఇచ్చారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల్లో 30 మంది మాత్రమే గెలుస్తారని, మిగతా వారిపై స్థానికంగా అసంతృప్తి ఉందని లగడపాటి తాజాగా చంద్రబాబుకు రిపోర్ట్ ఇచ్చిందని అంటున్నారు.
అయితే ఇప్పటి వరకు టీడీపీకి అనుకూలంగా రిపోర్టులు ఇచ్చే లగడపాటి తాజాగా ఇచ్చిన సర్వే రిపోర్ట్పై ఉహాగానాలు వినిపిస్తున్నాయి. మిగితా 102 మంది పరిస్థితి ఏంటనేది చర్చనీయాంశంగా మారింది. ఇక ఎమ్మెల్యేలకు బాబు సూచనలు లగడపాటి సర్వే నేపథ్యంలో పలువురు ఎమ్మెల్యేలపై చంద్రబాబు కూడా అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు. వారికి మరోసారి హెచ్చరికలు జారీ చేయనున్నారని తెలుస్తోంది. పనితీరు మార్చుకోవాల్సిందిగా సూచించనున్నారు.