Monday, April 29, 2024
- Advertisement -

రైల్వే కోడూరు ఎమ్మెల్యేకు జగన్ ఫోన్ జ‌గ‌న్ ఫోన్‌..మంత్రి ప‌ద‌వి ఖాయం..

- Advertisement -

ఏపీ నూతన ముఖ్యమంత్రి వైయస్ జగన్ కేబినెట్‌పై ఏర్పడనున్న తీవ్ర ఉత్కంఠకు రేపు తెరపడనుంది. రేపు జరుగబోయే వైసీపీ శాసనసభాపక్ష సమావేశంలో కేబినెట్ కూర్పుపై చర్చించి, మంత్రుల పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. అన్ని స‌మాజియ వ‌ర్గాల‌ను దృష్టిలో ఉంచుకొని మంత్రి వ‌ర్గం ఉండ‌నున్న‌ట్లు స‌మాచారం.ఇప్పటికే మంత్రుల జాబితాను ఫైనల్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మంత్రి పదవులు దక్కనున్న వారందరికీ జగన్ స్వయంగా ఫోన్ చేసి విషయం వివరిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే తాజాగా రైల్వే కోడూరు ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులుకు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫోన్ చేసిన‌ట్లు స‌మాచారం. మంత్రి వర్గంలో కోరుముట్ల శ్రీనివాసులుకి చోటు కల్పిస్తున్నట్లు జగన్ ఆయనకు చెప్పారు. దీంతో కొరముట్ల హుటాహుటిన తన అనుచరగణంతో విజయవాడకు బయలుదేరి వెళ్లారు. దీంతో కోడూరులో అభిమానులు, కార్యకర్తలు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు

కొరముట్ల శ్రీనివాసులు రైల్వేకోడూరు నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ కొట్టారు. 2019 ఎన్నికల్లో కూడా టీడీపీ అభ్యర్థి నర్సింహాప్రసాద్‌పై శ్రీనివాసులు భారీ మెజార్టీతో గెలుపొందారు. వైఎస్ హయంలో 2009 ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం 2012, 2014 ఉప ఎన్నిక, తాజాగా జరిగిన ఎన్నికల్లో మళ్లీ కొరుముట్ల శ్రీనివాసులు ఎమ్మెల్యేగా గెలుపొందారు. తీంతో ఆయ‌న్ను జ‌గ‌న్ మంత్రి వ‌ర్గంలోకి తీసుకున్న‌ట్ల తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -