Sunday, April 28, 2024
- Advertisement -

అంతమందిని లోకేష్ ఎలా ఎత్తుకొచ్చాడు..!

- Advertisement -

టీడిపి పార్టీ సోషల్ మీడియాలో తన లోటు ఏంటో తెలుసుకుంది. వై ఎస్ ఆర్ సిపీతో ఎలాగూ వేగలేమని అర్ధం చేసుకుని అటు సైడ్ నుంచి నరుక్కు వద్దామని చూస్తుంది. దానిలో భాగంగా… తన సైన్యాన్ని అమాంతం పెంచేస్తుంది. అలా పెంచితే తప్ప తమకు సినిమా కనిపించదని అర్ధం చేసుకుంది. ఇందుకోసమని లోకేష్ బాబు ఏకంగా 600 మంది యువకులను ఎంపిక చేసి వారికి ప్రత్యేక శిక్షణా తరగతులు ఏర్పాటు చేసింది.

కేసీఆర్ కు కేటిఆర్ ఎలాగో… బాబుకు లోకేష్ అలా అన్నట్లుగా పేరు రావాలని లోకేష్ ఎంతగానో కష్ట పడుతున్నాడు. ప్రస్తుతం తన టీంకు లోకేష్ గుంటూరు వేదికగా శిక్షణా తరగతులను ఏర్పాటు చేశాడు. ఇందుల్లో భాగంగా పొలిటికల్ పంచ్ ,రవి కిరణ్ లాంటి వారికి ఝలక్ ఇచ్చే చురుకైన యువకులను ఎంచుకున్నాడు.వీరంతా లోకేష్ కు భజన చేస్తూ.. బాబు కోసం బ్రింగ్ బ్యాక్ బాబు నినాదాన్ని మళ్లీ లైమ్ లైట్లోకి తేవాలని చూస్తున్నారు.

విద్యావంతులు, యువ జర్నలిస్టులు కూడా ఈ 600 మందిలో ఉన్నారంటే.. విషయం ఎంతలా ఉందో అర్ధం అవుతుంది. సమీప భవిష్యత్ లో ఎలక్షన్స్ సమీపిస్తున్న సమయంలో భారీ తాయిలాలు ఇచ్చి… జర్నలిస్టులను పెద్ద సంఖ్యలో టీడిపి శ్రేణులు ఎత్తుకు పోవచ్చంటూ రాజధానిలో రూమర్లు రౌండ్లు కొడుతున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -