నంద్యాల ఉప ఎన్నిక ప్రచారం ఈరోజుతో ముగిసింది. గత కొద్ది రోజులుగా నంద్యాల నియేజకవర్గం పార్టీలప్రచారంతో హోరెత్తింది. అదికార , ప్రతి పక్షాల సవాల్లు,ప్రతి సవాల్లు, విమర్శలతో మారుమోగిపోయింది నంద్యాల పట్టనం. అయితే కొందురు నాయకులు చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. ఆ కోవలోనె మంత్రి అఖిల వ్యటకార వ్యాఖ్యలు ఆకాశాన్ని తాకాయి.
శిల్పా మోహన్ రెడ్డిపైమంత్రి అఖిలప్రియ భలే సెటైర్లు వేస్తున్నారు . నంద్యాల ఉపఎన్నికను రాష్ట్రం మొత్తం చూస్తోందట. వైసీపీ అభ్యర్ధి శిల్పా మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్లిపోయారో అర్థం కావడం లేదట. నియోజకవర్గంలో 13 రోజుల వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి రోడ్డుషోల్లోను, ఇంటింటి ప్రచారంలో పక్కనే ఉన్న శిల్పా మంత్రి అఖిలకు కనబడలేదట. శిల్పా ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారా, లేక బెంగళూరుకు వెళ్లిపోయి వ్యాపారాలు చేసుకుంటున్నారా అంటూ భలేగా జోక్ చేస్తున్నారు.
స్ధానిక-స్ధానికేతర అంశం గురించి మాట్లాడుతూ, ‘ప్రజలకు తెలుసు ఎవరు లోకలో, ఎవరు నాన్ లోకలో’ అని అన్నారు. అంటే మంత్రి ఉద్దేశ్యమేంటి? శిల్పా మోహన్ రెడ్డి నాన్ లోకల్ అని చెప్పటమేనా. ఆమాటకొస్తే టిడిపి అభ్యర్ధి భూమా బ్రహ్మానందరెడ్డే నంద్యాలకు నాన్ లోకలని టిడిపి నేతలే ఆప్ ది రికార్డుగా చెబుతున్న విషయం అఖిల చెవిన పడలేదేమో.
ఇక, పదమూడేళ్లు అధికారంలో ఉండి ఒక్క పని కూడా చేయని శిల్పా ఓట్లు అడగడానికి చాలా ఇబ్బందిపడ్డారని మంత్రి చెప్పటం భలే క్యామిడీగా లేదు. ఓ వైపేమో అసలు ప్రచారంలో శిల్పా కనబడలేదని చెబుతూనే ఇంకోవైపేమో ఓట్లు అడగటంలో అభ్యర్ధి ఇబ్బంది పడ్డారని చెప్పటం విచత్రంగా ఉంది.
13 సంవత్సరాలుగా నంద్యాలకు ఏంచేయకుండా శిల్పా ఓట్లడగటంలో ఇబ్బంది పడ్డారనే అనుకుందాం? మరి, టిడిపిలోకి ఫిరాయించిన తర్వాత భూమా నాగిరెడ్డి మాత్రం ఏం ఊడబొడిచేసాడు? పోనీ మంత్రైన తర్వాత అఖిలప్రియ ఉద్ధరించేసిందేముంది నంద్యాలకు. ప్రచారానికి వెళ్లినపుడు అఖిలను జనాలు నిలదీస్తే జనాలకు ఏం సమాధానం చెప్పలేకే కదా ప్రచారాన్ని అర్ధాంతరంగా ముగించుకుని వెళ్లిపోయింది చాలా చోట్ల. అలాంటి అఖిల వైసీపీ అధినేత జగన్ మీద వ్యటికారానికి ఏంత క్కువలేదు.