బెంగాల్ లో రెండో దశ పోలింగ్లో భాగంగా.. నందిగ్రామ్ భాజపా అభ్యర్థి సువేందు అధికారి.. తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నందనాయకర్ ప్రాథమిక పాఠశాల పోలింగ్ బూత్ నెం.76లో ఓటు వేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఓటు వేసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో రావాలని కోరారు.
ఎనిమిది దశల బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత కీలక ఘట్టానికి నందిగ్రామ్ పోలింగ్ కేంద్రాలు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. బంగాల్ సీఎం మమతా బెనర్జీ- బిజేపి నేత సువేందు అధికారి ఇక్కడ బరిలోకి దిగడం వల్ల పోరు రసవత్తరంగా మారింది.
దేశం మొత్తం నందిగ్రామ్ వైపు చూస్తున్నందున.. ప్రజలు ఓటు వేసేందుకు పెద్ద సంఖ్యలో రావాలని కోరుతున్నాను. అభివృద్ధి రాజకీయాలు గెలుస్తాయా? అసంతృప్తి కలిగించే రాజకీయాలు గెలుస్తాయా? అని ఇక్కడి ప్రజలు ఎదురుచూస్తున్నారు.
సీఎం జగన్ తెగ మెచ్చుకుంటున్న తెలంగాణ ఉద్యోగులు!
నేటి పంచాంగం.. 01042021 (గురువారం )
వైఎస్సార్ భీమా లబ్దిదారులకు శుభవార్త.. రూ. 254 కోట్లు విడుదల చేసిన సీఎం జగన్!