ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ నాయకురాలు భూమా అఖిల ప్రియను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. కూకట్పల్లిలో భూమా అఖిలప్రియను అదుపులోకి తీసుకున్నారు. ఆమెను మహిళా పోలీస్ స్టేషన్కు తరలించి ప్రశ్నిస్తున్నారు. కాగా, ఈ కిడ్నాప్కు హపీజ్పేట్లోని భూ వ్యవహారమే కారణంగా చెబుతున్నారు. 2021, జనవరి 06వ తేదీ బుధవారం ఆమెను అదుపులోకి తీసుకుని బోయిన్ పల్లి పీఎస్ కు తరలిస్తున్నారు.
ఈ కేసులో 15 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అఖిల ప్రియ, ఆమె భర్తపై పోలీసులకు ప్రవీణ్ రావు కుటుంబసభ్యుల ఫిర్యాదు చేసినట్లు సమాచారం. మొత్తం ఆరు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు.. కూకట్పల్లిలో భూమా అఖిలప్రియను అరెస్ట్ చేయగా… ఆమె భర్త భార్గవరామ్ పరారీలో ఉన్నారు.
ఇదిలా ఉంటే.. గత రాత్రి 11 గంటల సమయంలో సినీఫక్కీలో హకీ క్రీడాకారుడు ప్రవీణ్రావు కిడ్నాప్కు గురయ్యాడు. బోయినపల్లిలో కిడ్నాప్కు గురైన ముగ్గురు వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డారు. నార్సింగిలో ముగ్గురిని కిడ్నాపర్లు వదిలి పారిపోయారు. దీంతో ప్రవీణ్, నవీన్, సునీల్ సురక్షితంగా ఇంటికి చేరుకున్నారు. అఖిల ప్రియను ఇప్పుడు అదుపులోకి తీసుకోవడంతో.. ఈ కేసు మలుపు తిరిగింది.
బీజేపీ భారీ స్కెచ్.. త్వరలో కేసీఆర్కు భారీ షాక్?
30 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమకు టచ్లో ఉన్నారు? : బండి సంజయ్ సంచలన…