నంద్యాల ఉప ఎన్నిక గెలుపు రాజకీయాలలో ఎలాంటి సెగలు రేపుతుందో అందరికి తెలిసిందే. అందుకే వైసీపీ,టీడీపీ రెండు పార్టీలు గెలుపు మాదంటె మాదెనని ధీమా వ్యక్తం చేస్తున్నారు.ఇద్దరికి గెలుపు అంత సులభం కాదు.ఎన్నికల ఓట్ల లెక్కింపులో లాస్ట్ రౌండ్ వరకు ఫలితం తేలదు.అందుకే ఈ ఉప ఎన్నిక సెగ ఎన్డీఏకు తాకింది. భాజాపా ఈ ఎన్నికపై నిఘా పెట్టినట్లు తెలుస్తోంది.
దక్షిణాదిలో పాగా వేయాలనుకుంటున్న భాజాపానంద్యాలఉపఎన్నికమమీదనెప్రధానంగా మోదీ, అమీత్షా దృష్టిసారించింది.ఎందుకంటె ఆ ఫలితంపైనె పార్టీల పొత్తులు ఆధారపడిఉన్నాయి. ఇప్పటికే అన్ని రాష్ట్రాలను తమ చెప్పుచేతుల్లో పెట్టుకుంటున్న ఎన్డీఏకు ఏపీలో మాత్రం అలాంటి పప్పులు ఉడకంలేదు.అందుకే ఎలాగైనా తన గుప్పిట్లో పెట్టుకొనేదానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
ఈనెల 28 నుంచి మూడు రోజులపాటు భాజాపా ఛీప్ అమీత్షా పర్యటన కరారయ్యింది.అప్పటికే నంద్యాల ఉప ఎన్నిక ఫలితం వస్తుంది కాబట్టి పొత్తులపై ఆలోచించనున్నారు.ఒక వేల వైసీపీ గెలిస్తె…టీడీపీ పై భాజాపా పరోక్షంగా విమర్శలు గుప్పించవచ్చు.దీంతో టీడీపీ ఎటూ మాట్టాడలేని పరిస్థితి. వచ్చే ఎన్నికల్లో వైసీపీతో కలసి పోటీ చేయాలని చూస్తోంది కమళ దలం.
టీడీపీ ఓడిపోతె ఆ పార్టీ నాయకులను ఎవరూ లెక్కచేయరు.ఇప్పటికే మిత్రపార్టీతో తెగదెంపులు చేసుకోవాలనె వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఓటమిని షాకుగా చూపి కపార్టీని బలోపేతం చేసెందుకు పావులు కదుపుతున్నారు. భాజాపా ఆడుతున్న డబుల్ గేమ్కు ఇరు పార్టీలు ఎలాంటి షాక్ ఇస్తారో చూడాలి.