Monday, April 29, 2024
- Advertisement -

టీడీపీ కార్యాలయంలో బీజేపీ జెండాలు

- Advertisement -

గ‌త ఎన్నిక‌ల‌ప్పుడు క‌లిసిమెలిసి తిరిగిన టీడీపీ , బీజేపీ ఇప్పుడు విడిపోయి తీవ్ర విమ‌ర్శ‌లు చేసుకుంటున్న సంగ‌తి తెలిసింది. ఏపీకి బీజేపీ ప్ర‌భుత్వం తీవ్ర అన్యాయం చేసింద‌ని టీడీపీ పార్టీ కేంద్ర క్యాబినేట్ నుండి బ‌య‌టికి వ‌చ్చింది. దీంతో టీడీపీ, బీజేపీ నేతలు ఉప్పు నిప్పులా ఉన్నారు. మ‌రి ఇలాంటి సంద‌ర్భంలో టీడీపీ పార్టీ కార్య‌ల‌యంలో బీజేపీ జెండాలు క‌నిపించ‌డం పెద్ద ఇష్యూగా మారింది. పూర్తి వివరాల‌లోకి వెళ్తే.. విజయనగరం జిల్లాలో టీడీపీ ఎమ్మెల్సీగా ద్వారపురెడ్డి జగదీష్ ఉన్న సంగ‌తి తెలిసిందే.

ఎమ్మెల్సీ జగదీష్‌ సోదరుడైన రామ్మోహనరావు ఈ నెల 22న బీజేపీలో చేరడం, వెనువెంటనే పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ అరకు ఇన్‌చార్జిగా డాక్టర్‌ రామ్మోహనరావును ప్రకటించారు. ఆదివారం నాడు ఏకంగా రామ్మోహనరావు తెలుగుదేశం కార్యాలయంలోనే బీజేపీ ప్రెస్‌మీట్‌ పెట్టడాన్ని అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. టీడీపీ బ్యానర్‌పై బీజేపీ జెండాలను, మోదీ ఫొటోను ఏర్పాటు చేసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. మ‌రి దీనిపై టీడీపీ అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -