టీఆర్ ఎస్ శ్రేణులపై రాములమ్మ ఫైర్ అయ్యారు. గులాబి నేతలు తాజాగా చేసిన ఆర్భాటం సరికాదని బీజేపీ నాయకురాలు విజయశాంతి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా టీఆర్ ఎస్ నేతలు చేసిన అడావిని ఆమె తప్పుపట్టారు. పెద్దసారు దగ్గర క్రేడిట్ కొట్టేయాలని కోటి వృక్షార్చన అంటూ ప్రచారం చేశారని విజయశాంతి అన్నారు.ఈ ఆర్భాటపు కార్యక్రమంలో భాగంగా ప్రతీ గ్రామంలో వెయ్యి మొక్కలు నాటాలని గ్రామాధికారులకు ఆదేశాలైతే ఇచ్చారు. కానీ దాని తాలుక బిట్లులు ఇవ్వలేదని పేర్కొన్నారు.
గతంలో నాటిన మొక్కల బిల్లులే రాలేదని వారు మొత్తుకుంటే.. మళ్లీ ఇప్పుడు మొక్కలు నాటాలని ఆదేశాలు ఇవ్వడం సమంజసం కాదని పేర్కొన్నారు. వేసవి కాలంలో నీళ్లు లేక మొక్కలు చనిపోతే.. వారి మీద షోకాజులు పంపుతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవేవీ సర్కారుకు పట్టదని, అసలు ప్రజల బాగోగులే వారికి అవసరం లేదని పేర్కొంది.
సారుకు తమ కుటుంబం, తన ఫాంహౌస్ పచ్చగా ఉంటే చాలని విజయశాంతి విమర్శించారు. గతంలో కూడా వేల కోట్ల రూపాయలతో మొక్కలు నాటే ప్రణాళిక సిద్ధం చేసి చేతులేత్తేశరని పేర్కొన్నారు. అలాగే ఈ కరోనా కష్ట కాలంలో జీతాలందక ఆర్టీసీ ఉద్యోగులు, జీహెచ్ఎంసీ ఉద్యోగులు వేదనకు గురవుతున్నారని పేర్కొంది. వాటి సంగతి ముందు చూస్తే.. మంచిదని తెలిపారు.
రామ్ చరణ్, శంకర్ సినిమా కథ ఎలా ఉండబోతుందంటే..?
ఉదయాన్నే నిమ్మరసం తాగితే.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
క్రేజీ ఆఫర్ కొట్టేసిన కన్నడ భామ! రామ్ చరణ్ మూవీలో రచ్చ..!