Thursday, April 25, 2024
- Advertisement -

బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అరెస్ట్!

- Advertisement -

దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావును పోలీసులు అరెస్ట్ చేశారు. వేములఘాట్‌లో ఆత్మహత్య చేసుకున్న మల్లన్న సాగర్ ముంపు బాధితుడు మల్లారెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న ఆయనను తుక్కాపూర్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మల్లన్న సాగర్ ముంపు బాధితుడు మల్లారెడ్డి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.

ఈ ఆత్మహత్య వ్యవహారం రాష్ట్రంలో చర్చనీయాంశం అయింది. ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ క్రమంలోనే మల్లారెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు బయలుదేరిన ఎమ్మెల్యే రఘునందన్‌రావును పోలీసులు తుక్కాపూర్ వద్ద అరెస్ట్ చేశారు. అనంతరం రాయపోల్ మండలంలోని బేగంపేట పోలీస్ స్టేషన్‌కు ఆయనను తరలించారు.

తెలంగాణలోని దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ తరపున రఘునందన్ రావు సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రఘునందన్ మాట్లాడుతూ.. తెలంగాణలో నిరంకుశ పాలన కొగుతుందని.. మల్లన్న సాగర్ బాధితుడు ఆత్మహత్య చేసుకుంటే పరామర్శించడానికి వెళ్తే అరెస్ట్ చేయించడం హేయమైన చర్య అన్నారు. సభ్య సమాజం తలదించుకునేలా కేసీఆర్ పాలన ఉందని విమర్శించారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టుపై మాట్లాడేవారిని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు.

జవాన్స్ తో డ్యాన్స్ వేసిన అక్షయ్ కుమార్..?

ఒకే పెళ్లి మండపంలో ఇద్దరికి మూడు ముళ్లు లక్కీ పెళ్లికొడుకు!

అనాజ్‌పూర్‌లో దారుణం.. నీటి ట్యాంకులో చిన్నారి మృతదేహం కలకలం..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -