Saturday, May 18, 2024
- Advertisement -

మేం చెబితే అచ్చెన్నాయుడే విన‌డు.. జ‌గ‌న్ , ప‌వ‌న్‌లు వింటారా…?

- Advertisement -

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఏర్పాటు చేసిన అఖిల‌ప‌క్ష స‌మావేశం ఘోరంగా విఫ‌లమ‌య్యింది. స‌మావేశానికి కాంగ్రెస్‌, వామ‌ప‌క్షాలు త‌ప్ప మిగిలిన ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షాలు వైసీపీ, జ‌న‌సేన‌, భాజాపాలు హాజ‌రు కాలేదు. అఖిల‌ప‌క్షానికి రాని పార్టీల‌పై బాబు చేసిన వ్యాఖ్య‌ల‌పై బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు స్పందించారు.

పార్టీ ఏకగ్రీవంగా తీసుకున్న నిర్ణయం మేరకే తాము గైర్హాజరు అయ్యామని, చంద్రబాబు తన రాజకీయ ప్రయోజనాల కోసం సమావేశం పెడితే తామెందుకు హాజరు కావాలని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్, జగన్ లను అడ్డు పెట్టుకుని బీజేపీ నాటకాలు ఆడుతోందని తెలుగుదేశం నేతలు చేస్తున్న విమర్శలను ప్రస్తావించిన ఆయన, “వైఎస్‌ జగన్‌ కు మేం చేబితే ఎందుకు వింటారు? మేం చెప్పిన మాట పవన్‌ వింటాడా?, మేం చెబితే అచ్చెన్నాయుడే వినడు… వారెందుకు వింటారంటూ సెటైర్లు వేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -