ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావడానికి బీజేపీ పార్టీ ఎంత ఆసక్తి గా ఉందంటే ఇప్పటికిప్పుడు ప్రజలు అధికారం ఇస్తే చేపట్టే ఆలోచనలో ఉంది.. అయితే వెనుకా ముందు చూసుకుకోకుండా ఎలా బీజేపీ అధికారాన్ని చేపడుతుందన్నదే ప్రశ్న.. వాస్తవానికి గతంలో లేనంత దూకుడుగా ప్రజల్లో ఇప్పుడు బీజేపీ పార్టీ ఉంది. సోము వీర్రాజు ప్రజల్లోకి పార్టీ ని తీసుకెళ్లడం లో చాలా వరకు సక్సెస్ అయ్యారు.. అందుకే ఆయనను ముద్దుగా షార్ప్ షూటర్ అని పిలుస్తున్నారు బీజేపీ నాయకులూ..
రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలని గట్టి పట్టుదలపై ఉన్న బీజేపీ జాతీయ నాయకత్వం.. ఆదిశగా కావాల్సిన కార్యాచరణను తనదైన శైలిలో అమలు చేస్తోంది. ఈ క్రమంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆర్ ఎస్ ఎస్ మూలాలున్న నాయకులను బీజేపీ సారథులుగా నియమించింది. దీంతో పాటు సదరు నాయకులకు వాగ్ధాటి కూడా ఉండడం పార్టీకి కలిసి వచ్చే పరిణామం. అయితే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి ఏమైనా చేయమని సోము కి కేంద్ర ప్రభుత్వం అధికారాలు ఇచ్చిందట.. అందుకే తగ్గట్లే ఎవరిపై అయినా విమర్శలు చేయడంలో వీర్రాజుకు ఏ మాత్రం మొహమాటం ఉండదు అన్న సంగతి తెలిసిందే..
గతంలో బీజేపీ తరఫున గెలిచిన నాయకుల్లో కొందరుపార్టీకి దూరమయ్యారు. అదేవిధంగా కొత్తగా చేరిన వారు కూడా పార్టీలో యాక్టివ్గా లేరు ఇలాంటివారిని గుర్తించి, వారిని తిరిగి పార్టీలో యాక్టివ్ చేయడం, పార్టీలో బాధ్యతలు అప్పగించడం వంటి కీలక బాధ్యతను సోము వీర్రాజు పై పెట్టారట.. జాతీయబీజేపీ నాయకులు. ఆ విధంగానే అయన కూడా తన పనులు చేస్తున్నారు.. అయితే వారు చెప్పిన దానికంటే ముందే సోము వీర్రాజు ఆ పని చేసి పెట్టారట.. ఇప్పటికే పార్టీ కి దూరమైనా కొందరు నేతలను తిరిగి పార్టీ కి సేవలందించాల్సిందిగా కోరారు.. మరి అధిష్టానం చెప్పింది ముందే చేస్తున్న సోము వీర్రాజు వచ్చే ఎన్నికల నాటికి పార్టీ ని ఏమాత్రం బలోపేతం చేస్తారో చూడాలి..
అయోమయంలో టీడీపీ ఇన్ ఛార్జ్ లు…
గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్..?