Friday, May 3, 2024
- Advertisement -

పెళ్ళి ఏర్పాట్లలో ఉన్న అఖిలప్రియకు షాకిచ్చిన చంద్రబాబు

- Advertisement -

ఏ క్షణాన భూమా ఫ్యామిలీ టిడిపిలో చేరిందో ఆ మరుక్షణం నుంచే భూమా కుటుంబం మొత్తానికి మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు చంద్రబాబు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆజన్మ శతృవులయిన నాయకులను తప్పనిసరిగా గెలిపించాలన్న షరతుల పుణ్యమాని భూమా నాగిరెడ్డి ఒత్తిడికి గురయ్యాడు. ఇప్పుడు అఖిల ప్రియ అంతకుమించిన ఒత్తిడి ఎదుర్కుంటోంది. తన పెళ్ళి ఏర్పాట్లలో ఉన్న అఖిలప్రియకు మనశ్శాంతి లేకుండా చేసే చర్యలు తీసుకున్నాడు చంద్రబాబు.

ప్రశాంతంగా తన పెళ్ళి ఏర్పాట్లలో ఉన్న అఖిలప్రియకు సమాచారం లేకుండా ప్రత్యేకంగా ఎవి సుబ్బారెడ్డిని తన ఇంటికి పిలిపించుకున్నాడు చంద్రబాబు. చాలా సేపు ఎవి సుబ్బారెడ్డితో మాట్లాడాడు. ఆళ్ళగడ్డలో పార్టీ పరిస్థితి అస్సలు బాగాలేదని ఎవి సుబ్బారెడ్డితో చెప్పాడట. 2019 ఎన్నికల వరకూ అఖిలప్రియ, ఎవి సుబ్బారెడ్డిలిద్దరూ కలిసి పార్టీ కోసం పనిచేస్తే …… అప్పుడు ఎన్నికల సమయంలో ఎవరికి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటే వాళ్ళకు టికెట్ కేటాయిస్తానని చెప్పాడట. ఇప్పుడు చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయమే అఖిలప్రియలో టెన్షన్ పెంచుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి పదవిలో ఉన్న అఖిల ప్రియ స్థానంలో టిడిపికి ఓటమి భయం పట్టుకోవడం…….అది కూడా స్వయంగా చంద్రబాబే తన సర్వే రిజల్ట్స్ బయటపెట్టడం…….. ఎవరు గెలిచే అవకాశం ఉంటే వాళ్ళకే టికెట్ అని చెప్పడం……… అఖిలప్రియకు సీటు గ్యారెంటీ అనేదీ ఏమీ ఉండదని ఎవి సుబ్బారెడ్డికి హామీ ఇవ్వడం లాంటివి ఇప్పుడు భూమా ఫ్యామిలీలో టెన్షన్స్ పెంచుతున్నాయి. భూమానాగిరెడ్డి మరణం విషయంలో బాబుపై ఆగ్రహంగా ఉన్న భూమా కుటుంబ అభిమానులను అఖిలప్రియకు మంత్రి పదవి ఇచ్చి శాంతపరిచాడు బాబు. ఇప్పుడు మరోసారి అఖిలప్రియకు అలాంటి ఒత్తిడిని, టెన్షన్స్‌ని ఇస్తున్నాడు బాబు. ఈ సారి భూమా అభిమానుల స్పందనలు ఎలా ఉంటాయో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -