నంద్యాల ఉప ఎన్నికల పోరులో గెలవడానికి చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అన్నీ బెడిసి కొడుతున్నాయి. కాని ఇప్పుడు గెలవడానికి ప్రధాన ఆయుధాన్ని ప్రయేగించారు. ఆ ఆచేధమూ కుల ఆయుధం.ఈ ఆయుధానికి తిరుగులేదనేది తెలిసిందే. అయితే నంద్యాలలో ఇది ప్రయత్నిస్తుందా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
కులం, మతం ప్రాతిపదికన ఓట్లు అడగకూడదని ఈసీ మార్గదర్వకాలున్నా…బాబు మాత్రం నంద్యాలను కులాల వారీగా వర్గాల వారీగా బాబు విడదీసి చూస్తున్నాడని స్పష్టం అవుతోంది. ముస్లిం మైనారిటీ నేతలతో బాబు మాట్లాడిన తీరు వీడియోల్లో కూడా రికార్డు అయ్యింది. ముస్లిం ఓట్లు యాభై ఏడువేల చిల్లర ఉన్నాయని.. అవన్నీ ఒక్కటి కూడా పక్కకుపోకుండా టీడీపీకే పడాలని వార్నింగ్ ఇచ్చివెల్లారు.
కేవలం ముస్లిం ఓట్లనే కాదు.. అన్ని ఓట్లనూ బాబు కులాల వారీగానే విడదీశాడు. ముస్లిం ఓట్లు, బలిజల ఓట్లు, రెడ్ల ఓట్లు, బీసీల ఓట్లు, వైశ్యుల ఓట్లు.. ఇలా అన్నమాట. ఇదీ బాబుగారి లెక్క. బలిజలతో ఒక సమవేశం పెట్టిస్తున్నాడు, టీజీ వెంకటేష్ను పిలిపించి వైశ్యులతో మీటింగ్ పెట్టించాడు. బీసీల ఓట్లకు ప్రతినిధి కాలువ శ్రీనివాసులు అట, ముస్లిం ఓట్లకు ఫరూక్.. అది బాబుగారి లెక్కన్నమాట.
ఇంత వరకు బాగానె ఉంది. మరి బాబుగారు హామీ ఇచ్చిన కాపు రిజర్వేషన్ల గురించి ఎవరైనా అడిగితే.. కులచిచ్చు పెడుతున్నారు..అంటూ బాబు రంకెలు వేస్తారు. బాబుతో పాటు ఇతర నాయకులందరు అదేమాట. తను మాత్రం సమాజాన్ని పూర్తిగా కులాల వారీగా విడగొట్టే.. ఒక్కో కులానికీ ఒక్కోరిని ప్రతినిధిగా మార్చేసి.. మొత్తం మ్యానిపులేట్ చేయాలని చూస్తున్నాడు. మేమే చేస్తె సంసారం….ఇతరులు చేస్తె వ్యభిచారం ఇదెక్కడి విడ్డూరమే ..ప్రజలు కూడా అప్పడప్పుడు గమనిస్తుంటారు.
https://www.youtube.com/watch?v=pzXC0MfaL94