కర్నాటలో పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరింది. ప్రధానంగా భాజాపా, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారంలో దిగారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా? అంటూ సవాల్ విసిరారు. సీఎం సిద్ధరామయ్య సంతకంతో కూడిన ఫుల్ పేజీ ప్రకటనలు నేడు కర్ణాటక దినపత్రికల్లో ప్రచురితం అయ్యాయి.
రాష్ట్రంలో తన పోటీ నరేంద్ర మోదీతో కాదని, యడ్యూరప్పతోనేనని వెల్లడించారు. ఓపెన్ డిబేట్ కు తాను సిద్ధమని, తనతో చర్చకు యడ్యూరప్పతో పాటు నరేంద్ర మోదీలను ఆహ్వానిస్తున్నానని అన్నారు. ప్రజలముందు మోదీ తప్పుడు సమాచారాన్ని ఉంచుతున్నారని, అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. ఎవరు సత్యవంతులో కర్ణాటక నిర్ణయిస్తుందని అన్నారు. 6.5 కోట్ల మంది కర్ణాటక ప్రజల భవిష్యత్తు కోసం తాను పాటుపడుతున్నానని సిద్ధారామయ్య తెలిపారు.
PM Modi is deliberately confusing Karnataka voters with his bombastic speeches on non-issues. All hot air & no substance. My contest is not with him. It is with Yaddyurappa.
I challenge him to an open debate on issues on a single platform. Will he accept? Modi is also welcome! pic.twitter.com/34Jl6nIeOE
— Siddaramaiah (@siddaramaiah) May 7, 2018