Thursday, May 2, 2024
- Advertisement -

కంటోన్మెంట్‌లో విషాదం..ఎమ్మెల్యే మృతి

- Advertisement -

హైదరాబాద్ కంటోన్మెంట్‌లో విషాదం నెలకొంది. స్థానిక ఎమ్మెల్యే లాస్య నందిత హైదరాబాద్ ఓఆర్ఆర్ పై జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. రీసెంట్‌గా జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి సారి గెలిచి ఎమ్మెల్యే అయ్యారు లాస్య నందిత. దివంగత మాజీ ఎమ్మెల్యే సాయన్న కూతురు.

గత ఫిబ్రవరిలో సాయన్న మృతి చెందారు. జీహెచ్‌ఎంసీలో కార్పొరేటర్‌గా సేవలందించిన ఆమెను తండ్రి సాయన్న మృతి తర్వాత ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించగా భారీ మెజార్టీతో తెలిచారు. లాస్య నందిత మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

ఇటీవల నల్గొండలో బీఆర్ఎస్ బహిరంగ సభకు హాజరై తిరిగి వస్తున్న క్రమంలో కూడా నార్కట్‌పల్లి సమీపంలోని చెర్లపల్లి వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారును ఆటో ఢీకొట్టింది.ఈ ఘటనలో ఎమ్మెల్యే లాస్య నందిత తలకు గాయాలయ్యాయి. ఈ గాయాల నుండి కోలుకుంటుండగానే రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు లాస్య నందిత.

ఇక లాస్య నందిత మృతి పట్ల బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్, కేటీఆర్, మంత్రి శ్రీధర్ బాబు సంతాపం తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -