ముఖ్యమంత్రి కేసీఆర్ను ఫామ్హౌస్లో కలిసినట్లు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలను తెజస అధ్యక్షుడు కోదండరాం ఖండించారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను ఎవరినీ కలవలేదని… కలవాల్సిన అవసరమూ లేదని ఉద్ఘాటించారు. ప్రస్తుతం తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఇలాంటిా పుకార్లు రావడం సహజం అని.. తాను ఎవరినీ కలవాల్సిన అవసరం కూడా లేదని అన్నారు.
శనివారం రాత్రి తాను హన్మకొండలోనే ఉన్నానని స్పష్టం చేశారు. రాజకీయంగా ఎదుగుతున్నప్పుడు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయటం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. ప్రజల కోసం పోరాటం చేస్తూ వస్తున్నా అని.. ప్రజా జీవితానికే తన జీవితం అంకితం అని అన్నారు.
తన గెలుపును ఓర్వలేని వారు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని… పట్టభద్రులెవరూ దుష్ప్రచారాలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. తప్పుడు వార్తలు ప్రచారం చేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని కోదండరాం తెలిపారు.
ఆ రెండు సీట్ల కోసం పోటీ..4 గంటల వరకు పోలింగ్..!
సమస్యలు పరిష్కరించే అభ్యర్థికే నా ఓటు : మంత్రి కేటీఆర్
బాంబ్ బ్లాస్ట్ కన్నా ఎక్కువ తుమ్మితే భయపడుతున్నారు : సద్గురు జగ్గీ వాసుదేవ్