Thursday, April 18, 2024
- Advertisement -

మాజీ ఎమ్మెల్యే దుగ్యాల శ్రీనివాసరావు ఇకలేరు!

- Advertisement -

ఈ మద్య తెలుగు రాష్ట్రాల్లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా రాజకీయ నేతలకు కొంత మందికి కరోనా రావడం కన్నుమూయడం జరిగితే.. ఇతర అనారోగ్య కారణాల వల్ల కన్నుమూశారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే దుగ్యాల శ్రీనివాసరావు కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.

ఇటీవల ఆయనను కుటుంబసభ్యులు హైదరాబాద్‌లోని యశోదా ఆస్పత్రిలో చేర్పించారు. యశోద చికిత్సపొందుతూ శ్రీనివాసరావు మృతి చెందారు.  2004 నుంచి 2009 వరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గం శాసనసభ్యులుగా పనిచేశారు. 

కాగా,  మంగళవారం వరంగల్‌లోని పద్మాక్షిగుట్ట శ్మశానంలో శ్రీనివాసరావు అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు కుటుంబసభ్యులు ప్రకటించారు. ఇక దుగ్యాల మృతిపై పలువురు సంతాపం ప్రకటించారు. దుగ్యాల మృతి పట్ల రాజకీయ నాయకులు సంతాపం ప్రకటించారు.

మోదీకి లైన్ క్లియర్.. ట్రంప్ సైడ్.. ఆయనే నంబర్ వన్..!

కేటీఆర్ కేబినెట్‌లో ప‌ద‌వుల కోసం లొల్లి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -