- Advertisement -
నాగార్జున సాగర్ శాసనసభ స్థానం ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్ 18,872 ఓట్ల మెజార్టీతో విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాగార్జున సాగర్ లో భారీ మహాసభ ఏర్పాటు చేసి ప్రజలను ఉత్తేజపరిచారని.. తెలంగాణలో మరోసారి టీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టారు.
ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్, నోముల భగత్ కి శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతుంది. తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ కు వైఎస్ షర్మిల శుభాకాంక్షలు తెలిపారు. కరోనా ను సైతం లెక్క చేయకుండా నాగార్జునసాగర్ లో ఎన్నికలు జరిపించి విజయాన్ని సొంతం చేసుకున్న కేసీఆర్ గారికి శుభాకాంక్షలు. ఈ ఆనంద సమయంలోనైనా కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చమని కోరుతున్నాం” అని అన్నారు.
దీదీ విజయం.. రాంగోపాల్ ఫన్నీ వీడియో.. వైరల్