ఏపీ మంత్రి నారాలోకేష్ రాజకీయ పరిజ్ణానం గురించి అదరికి తెలిసిందే. ఆయన మాటలతో పార్టీకి సమస్యలు తెచ్చిపెట్టడంతోపాటు ప్రతిపక్షనేత జగన్ ఇమేజ్ని అమాంతం పెంచేస్తున్నాడు. చినబాబు ప్రతీ సారి నోరు జారడం వల్ల ప్రతిపక్షాలకు లోకేష్ ఆయుధంగా మారుతున్నారన్నది బహిరంగ రహస్యమే.
పుత్ర రత్నానికి తెలుగు నేర్పించడంకోసం లక్షలు జీతాలిచ్చి టీచర్ను కూడా ఏర్పాటు చేశారు. కాని చినబాబులో ఇసుమంతైనా మార్పు కనిపిచడంలేదు. దీంతో లోకేష్ టీచర్ మైండ్ బ్లాక్ అయ్యింది. ప్రతి సారి స్టేజి మీద ఎదో ఒక కామెడీ చేసి ప్రజలను కడుపుబ్బా నవ్విస్తున్నాడు
తాజాగా జగన్మోహన్రెడ్డిపై చేసిన కామెంట్స్ ఉదాహరణ. జగన్ మోదీ రెడ్డి అని పేరు పెంట్టకుంటే బాగుంటాదని లోకేష్ చేసిన కామెంట్స్కు ఎలా రియాక్ట్ అవ్వాలో ప్రజలకు అర్ధం కాలేదు. అంతేకాదు భాజాపా అంటే భాజాపా, జగన్ , పవన్ పార్టీ అంటూ మరో జోక్ పేల్చారు.
లోకేష్ చేసిన వ్యాఖ్యలు చూస్తే ప్రధాని పేరును జగన్ పక్కన తీసుకొచ్చి పెట్టి జగన్ ఇమేజ్ను పెంచుతున్నట్టుగా ఉన్నాడు. లకేష్కూడా నీతులు చెప్పడం చూస్తే అందరూ నోరెల్లబెట్టాల్సిందే. నాలుగు సంవత్సరాలు భాజాపాతో కలసి కాపురం చేసిన పార్టీ టీడీపీ.
భాజాపాతో కలిసి ఉన్నప్పుడు లోకేష్ ప్రత్యేకహోదా వంటి అంశాల గురించి బ్రహ్మాండంగా మాట్లాడాడు. హోదా కావాలని ప్రజలను జగన్ తప్పుదోవ పట్టిస్తున్నారని గతంలో విమర్శలు చేశారు. ఇప్పుడేమో హోదా ఇవ్వకుండా బీజేపీ మోసం చేసింది పతివ్రతలాగా మాట్లాడుతున్నాడు లోకేష్. ఇప్పుడేమో లోకేష్ స్వరం మార్చి ఇలా మాట్లాడుతున్నాడు.