ప్రత్తుతం సోషియల్ మీడియా ప్రతీ ఒక్కరికీ ఆయుధంగా మారింది. ప్రతీ ఒక్కరు తమ భావాలను సోషియల్ మీడియా వేదికా పంచుకుంటున్నారు. ఇక రాజకీయ పార్టీలు కూడా విమర్శ, ప్రతి విమర్శలను ట్విట్టరే , ఫేస్ బుక్ వేదికగా మారుతోంది. టీడీపీ ఎంపీ, జనసేన పార్టీకి మధ్య ట్విట్టర్ వార్ ఇంకా కొనసాగుతూనే ఉంది.
ఇంటర్నేషనల్ మ్యాచ్లా గల్లా జయదేవ్ ఒకసారి లోక్సభలో మాట్లాడి మౌనం పాటిస్తున్నారని నిన్న జనసేన అధికారిక ట్విట్టర్ ఖాతాలో చేసిన ట్వీట్కి గల్లా జయదేవ్ దీటుగా సమాధానం ఇచ్చిన విషయం తెలిసిందే. తాను లోక్సభలో సెంచరీ కొట్టానని, గత నాలుగేళ్లలో ఇప్పటి వరకు 100 సార్లు మాట్లాడానని ఆయన ట్వీట్ చేశారు.
గల్లా ట్వీట్పై మళ్లీ జనసేన పార్టీ స్పందించి మరోసారి కౌంటర్ ఇచ్చింది. “మీరు పార్లమెంటులో 100 స్పీచ్లు ఇచ్చిన సందర్భంగా మీకు సన్మానం చేయడానికి మీ నియోజక వర్గ ప్రజలు మీ కోసం ప్రతిచోటా వెతుకుతున్నారు. చివరిసారిగా మీరు గుంటూరుకి ఎప్పుడు వచ్చారు? మీ బ్యాటరీలు ఛార్జ్ చేసుకోండి” అని జనసేన పేర్కొంది. మరి ఈ ట్వీట్కి గల్లా ఎలాంటి కౌంటర్ ఇస్తాడో చూడాలి.
Guntur public searching for you!
Your constituents are looking everywhere for you probably to felicitate you to celebrate the hundred speeches in Parliament.
When did the last time you visited Guntur? Get your batteries charged! pic.twitter.com/QPmhvdGDkf— JanaSena Party (@JanaSenaParty) April 28, 2018