సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ వైసీపీకీ ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ముఖ్యనేతలందరూ పార్టీ వీడేయోచనలో ఉన్నారు. దీనికంతటికి కారణం జగన్ వ్యవహార శైలి నచ్చకనే నేతలందరూ ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ముందునుంచి పార్టీని నమ్ముకున్న వారికి కాకుండా కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇవ్వడంతో జగన్పై తీవ్ర అసంతృప్తితో ఉన్న వారంత పార్టీ వీడేందుకు వెనకాడమని హెచ్చరికలు చేస్తున్నారు.
విజయవాడ సెంట్రల్ సీటు విషయంలో మల్లాది విష్ణు, వంగవీటి రాధ మధ్య తీవ్ర పోటీ నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే అధిష్టానం మాత్రం విష్ణువైపే మొగ్గు చూపడంతో రాధ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్టీ కార్యకర్తలు, అనుచరులతో చర్చింది భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు.
ఇదిలా ఉంటూ వైసీపీకీ మంచి పట్టున్న కర్నూలు జిల్లాలో పార్టీలో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా..’పాణ్యం’ ఎమ్మెల్యే ‘గౌరు చరితారెడ్డి’ వైకాపాను వీడబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ జిల్లానుంచి కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీ ఇప్పటికే టీడీపీ కండువా కప్పుకున్నారు.
దీనికి ప్రధాన కారణం వచ్చె ఎన్నికల్లో గౌరు చరితారెడ్డికి ఈ సారి టికెట్ ఇవ్వడానికి జగన్ నిరాకరిస్తుండటంతో పార్టీకి గుడ్బాయ్ చెప్పాలనే యోచనలో ఉన్నారంట. పాణ్యం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా గౌరు చరితారెడ్డి ఉన్నారు. కాని ఇటీవలే పార్టీలో చేరిన కాటసాని రామ్భూపాల్రెడ్డి’కి ఇక్కడ టిక్కెట్ ఇస్తున్నట్లు ‘జగన్’ ప్రకటించడంతో…’గౌరు’ కుటుంబం అగ్గిమీద గుగ్గిలం అవుతోంది.
వైఎస్ఆర్ తమకు ఎంత విలువ ఇచ్చాడో… తెలుసుకోకుండా..తమను కాదని ‘కాటసాని’కి టిక్కెట్ ఇస్తున్నట్లు ప్రకటించడం ఏమిటని..వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. మొదటి నుంచి తన వెనుక ఉన్న వారిని వై.ఎస్. ఆదుకుంటే…అందుకు విరుద్దంగా ‘జగన్’ వ్యవహరిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.
వైఎస్ కుటుంబం అంటే ఎంతో అభిమానుం ఉన్న నేతలు పార్టీని వీడుతున్నారనే వార్త జిల్లాలో ప్రచారం జరుగుతోంది. జగన్’ తనంతట తానే పార్టీని నాశనం చేసుకుంటున్నారనే మాట ఆ పార్టీ వర్గాల నుంచే వ్యక్తం అవుతోంది. ప్రజలల్లో పార్టీకీ మైలేజీ బాగా వస్తున్న తరుణంలో పార్టీలో వస్తున్న అంతర్గత సమస్యలను జగన్ ఎలా పరిస్కరిస్తారో చూడాలి.