Thursday, May 9, 2024
- Advertisement -

చంద్ర‌బాబును అంతం చేసె కుట్ర‌… ఆది సంచ‌ల‌న వ్యాఖ్య‌లు…

- Advertisement -

జ‌గ‌న్ పాద‌యాత్ర మొద‌లు పెట్టిన నాలుగు రోజుల‌కె అధికార‌,విప‌క్ష‌పార్టీ వైసీపీల మ‌ధ్య మాట‌ల యుద్ధం ఇప్పుడే తారాస్థాయికి చేరింది. ఇప్ప‌టికె టీడీపీ మంత్రులు ఇత‌ర నేత‌లు విమ‌ర్శ‌లు గుప్పించిన సంగ‌తి తెలిసిందే. ప్యార‌డైజ్ పేర్ల‌లో జ‌గ‌న్ పేరు రావ‌డంతో టీడీపీ నేత‌లు చేసిన వ్యాఖ్య‌ల‌పై జ‌గ‌న్ స్పందించారు. విదేశాల్లో తనకు ఆస్తులున్నట్టు నిరూపించాలని జ‌గ‌న్ చంద్ర‌బాబుకు సవాల్ విసిరారు. వైఎస్ జగన్ సవాల్‌పై టిడిపి నేతలు కూడ ఘాటుగానే స్పందిస్తున్నారు. మంత్రులు కళా వెంకట్రావు, సోమిరె్డ్డి చంద్రమోహన్‌రెడ్డి ఇత‌ర‌నేత‌లు స్పందించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడ తాజాగా మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డి జ‌గ‌న్‌పై మ‌రోసారి సంచ‌ల‌న ఆరోప‌న‌లు చేశారు.

ముఖ్యమంత్రి పీఠం కోసమే చంద్రబాబు చనిపోవాలని జగన్ కోరుకుంటున్నారని మంత్రి ఆదినారాయణరెడ్డి ధ్వజమెత్తారు. ఈ కారణంగానే నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా సీఎంను నడిరోడ్డుపై కాల్చి చంపాలని జగన్ నీచమైన భాషను ఉపయోగించారని ఆదినారాయణరెడ్డి గుర్తు చేశారు.

పాద‌యాత్ర‌మ‌ధ్య‌లోనె జ‌గ‌న్ జైలు కెల్ల‌డం ఖాయం అన్నారు. ఆయ‌న జైల్లో ఉంటేనె రాష్ట్రం బాగుప‌డుతుంద‌న్నారు. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన తనతో పాటు 22మంది ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్‌ ఆమోదిస్తే.. ఉప ఎన్నికలకు సిద్ధమని ఆదినారాయణరెడ్డి స్పష్టం చేశారు. స్పీకర్‌ ఫార్మాట్‌లోనే తాము సీఎంకు రాజీనామాలు అందజేశామన్నారు. తన రాజీనామా ఆమోదించాలని ముఖ్యమంత్రిని కోరినట్లు చెప్పారు. తనపై జగన్‌ గానీ, ఆయన కుటుంబ సభ్యుల్లో ఎవరైనా పోటీ చేయాలని సవాల్‌ చేశారు. మ‌రి ఆది వ్యాఖ్య‌ల‌పై వైసీపీ నేత‌లనుంచి ఎలాంటి రియాక్స‌న్ వ‌స్తుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -