విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలంలో ఓ మహిళను బట్టలూడదీసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేగుతోంది. ఇప్పటికే ఈ ఘటనపై వైసీపీ స్పందించింది. తాజాగా జనసేన అధినేత పవన్ ఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత తీరిగ్గా ట్వట్టర్లో స్పందించారు. డీపీ, బీజేపీ, వైసీపీలు ఈ ఘటనపై ఒకరిపై మరొకరు బురద చల్లుకోవడం మానేసి… ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఏంచేయాలన్న దానిపై అసెంబ్లీలో చర్చించాలని సూచించారు.
బాధితురాలికి అండగా నిలవాలని కోరుతూ అమెరికా, యూరప్ నుంచి ఎంతో మంది మహిళలు తనకు మెసేజ్ లు పంపుతున్నారంటూ ట్వీట్ చేశారు పవన్ అయితే పవన్ స్పందనపై వైసీపీ ఫైర్బ్రాండ్ రోజా మండిపడ్డారు. ఎవరో యూరప్ లో ఉన్న మహిళ నీకు మెసేజ్ చేసి సపోర్ట్ చేయమని అడితే వరకు ఒక ఆడపడుచుకు అవమానం జరిగిందన్న సంగతి నీకు తెలియక పోవడం సిగ్గు చేటని ఆమె ట్వట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు .
దళిత మహిళకు అన్యాయం జరిగిన వెంటనే వైసీపీ స్పందించిందని… నిందితులు అరెస్ట్ అయిన తర్వాత వైసీపీకి క్రెడిట్ వస్తుందనే భయంతోనే, ఈ రోజు కొందరు టీడీపీ ప్రభుత్వాన్ని నొప్పించకుండా ట్వీట్లు చేశారని ఎద్దేవా చేశారు.
ఎవరో యూరప్ లో ఉన్న మహిళ నీకు మెసేజ్ చేసి సపోర్ట్ చేయమని అడిగే వరకు ఇక్కడ పుట్టిన నీకు ఒక ఆడపడుచుకు అవమానం జరిగింది అని తెలియకపోవడం సిగ్గు చేటు #DalitWoman
— Roja Selvamani (@RojaSelvamaniRK) December 23, 2017