పాదయాత్ర.. ఈ పేరు వింటే చాలు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్ పేరు తప్పక గుర్తొస్తుంది.. ఎందుకంటే పాదయాత్ర ద్వారా ఎక్కువ లాభపడింది వీరిద్దరే.. అలా పాదయాత్ర చేశారో లేదో ఇద్దరు సీఎం లు అయ్యారు.. అయితే ప్రతిపక్ష పార్టీ నేత నారా లోకేష్ కూడా ఈ పాదయాత్ర చేయడానికి సిద్ధమవుతున్నారట..
గతం తో పోలిస్తే టీడీపీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది.. అటు చూస్తే చంద్రబాబు 75 ఏళ్లకు దగ్గరిగా వస్తున్నాడు.. పార్టీ అయన తర్వాత భవిష్యత్ లో పార్టీ భారం మోసే వ్యక్తి లోకేష్ ఒక్కడే. దాంతో పార్టీ లో నిలదొక్కుకోవడానికి, ప్రజల్లో పోయిన గౌరవం దక్కించుకోవడానికి లంకేశ్ పాదయాత్ర చేయాలనీ నిర్ణయించుకున్నారట..
ఇప్పటికే నారా లోకేష్ను డమ్మినేతగా ప్రత్యర్థి పార్టీల నేతలు డమ్మీ నేతగా ప్రొజెక్ట్ చేస్తున్నాయి. ఇప్పుడు ఇదే ముద్రను చెరుపుకోవడానికి తనకంటు ఒక ప్రత్యేకమైన సొంత ఇమేజ్ను ఏర్పాటు చేసుకోవడానికి లోకేష్ ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే పీకే టీమ్లో పని చేసిన కొంతమందిని తన టీమ్లో చేర్చుకుని వ్యూహాలకు పదునుపెడుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో లోకేష్ పోటీ చేసిన మంగళగిరి నుంచి ఓటమి చవిచూడడం ఆయనకు పొలిటికల్గా ఓ మైనస్ పాయింట్గా మారింది. దీంతో నేరుగా ప్రజల్లోకి వెళ్లి మాస్ లీడర్గా నిరూపించుకునేందుకు అవసరమైన కసరత్తు సాగుతోందని. ప్రస్తుతం ప్రణాళికల అన్నీ ఈ దిశగానే సాగుతున్నాయని టీడీపీ నేతలు చెబుతున్నారు. మరి పాదయాత్ర ఫార్మాలా లోకేష్కు కూడా కలిసొస్తుందా లేదా అనేది చూడాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.