వైసీపీ, జనసేన పార్టీల మధ్య మాటలయుద్ధం మొదలైంది.గతంలో ఎప్పుడూ ఒకరిమీద ఒకరు విమర్శలు చేసుకోలేదు. కాని తాజాగా పవన్ వైజాగ్ పర్యటనలో జగన్మీద చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు పవన్ను టార్గెట్ చేస్తున్నారు. తాజాగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పవన్కు అదిరిపోయో కౌంటర్ ఇచ్చారు.
23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు కొని తీసుకెళ్తే ఒక మాట కూడా ప్రశ్నించలేని నీవా మాకు విలువల గురించి చెప్పేది అని నిలదీశారు. పరకాల ప్రభాకర్ లాంటి వాళ్లను పట్టుకుని ‘వదలను’ అని అనడంతో పవన్ ఎంత పిరికివాడో, ఆయన క్యారెక్టర్ ఏంటో అర్థమవుతోందని అన్నారు.
ముందుగా, సినీ ఇండస్ట్రీలో జరుగుతున్న అక్రమాలు, మాఫియాపై పోరాడి, ఆ తర్వాత ప్రజల కోసం పోరాడాలని అన్నారు. పవన్ కల్యాణ్ తనకు భయం లేదని, జైలుకు వెళ్లడానికైనా సిద్ధమేనంటున్నారని, ఆయనే కాదు తాము కూడా అందుకు సిద్ధమేనని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గురించి అనవసరంగా అవాకులు చవాకులు పేలడం మంచి పద్ధతి కాదని, అటువంటి వ్యాఖ్యలు చేయకుండా మానుకోవాలని అనిల్ కుమార్ యాదవ్ హెచ్చరించారు.
సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాను 30 కోట్లకు చుట్టేసి.. దాని వంద కోట్లకు అమ్మి… అమాయకులైన డిస్ట్రిబ్యూటర్లను నాశనం చేశారే.. అది అసలైన దోపిడి అంటే అని అనిల్ కుమార్ యాదవ్ ఫైర్ అయ్యారు. పరకాల ప్రభాకర్ ఒక సైడ్ ఆర్టిస్ట్ అని.. అతడిపై అటాక్ చేయడం బట్టే పవన్ కల్యాణ్ క్యారెక్టర్ ఏంటో అర్థమవుతోందన్నారు. నిజమైన హీరో అయితే నేరుగా మొయిన్ విలన్తో ఫైట్ చేయాలి గానీ.. సైడ్ ఆర్టిస్ట్తో ఫైట్ చేయడం ఏమిటని అనిల్ ప్రశ్నించారు.
చంద్రబాబును వదిలేసి పరకాల వెంటపడుతున్నావంటేనే నీ స్థాయి ఏంటో అర్థమవుతోందని పవన్పై విరుచుకుపడ్డారు. చిత్రపరిశ్రమలో మాఫియా దెబ్బకు చిన్నచిన్న నిర్మాతలు నాశనం అయిపోతున్నారని.. ముందు వెళ్లి వారి తరపున పోరాటం చేసి అప్పుడు సమాజం గురించి మాట్లాడాలన్నారు.