Wednesday, May 22, 2024
- Advertisement -

ప‌వ‌న్ గుండుపై మంత్రి సునీత ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

- Advertisement -

మాజీ సినీ న‌టుడు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ జీవితంలో గుండు ఘ‌ట‌న‌కు చాలా పెద్ద క‌థ‌నాలే ఉన్నాయి. ఆ గుండును అనంత‌పురం నాయ‌కులు, మాజీమంత్రి ప‌రిటాల ర‌వి ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు గుండు కొట్టించార‌ని ఎన్నో క‌థ‌నాలు వ‌స్తున్నాయి. ఆ ఘ‌ట‌న ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రాజ‌కీయ దుమారమే రేగింది. ఎప్పుడూ ప‌వ‌న్ రాజ‌కీయాల్లోకి వ‌ద్దామ‌నుకున్న ఈ సంఘ‌ట‌న పైకి వ‌స్తుంటుంది. అయితే ఇటీవ‌ల ప‌వ‌న్‌క‌ల్యాణ్ అనంత‌పురము జిల్లాకు క‌రువు యాత్ర పేరిట వెళ్లాడు. ఈ స‌మ‌యంలో ఆ ఘ‌ట‌న మ‌ళ్లీ తెర‌పైకి వ‌చ్చింది. అయితే ఈ గుండు అంశంపై పరిటాల ర‌వి భార్య, ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రి ప‌రిటాల సునీత స్పందించారు.

తాజాగా ఇదే వ్యవహారంపై మంత్రి పరిటాల సునీత తాజాగా స్పందించారు. పరిటాల రవి అందరికీ సపోర్ట్ చేసే మనిషని – ఆయన ఎవరికీ గుండు కొట్టించలేదని చెప్పారు. ఆయన ఒకరిని ఇబ్బందిపెట్టే వ్యక్తి కాదని స్పష్టం చేశారు. మీడియా ప్రతినిధులు పవన్‌ను ఆ వ్యవహారంపై ప్రశ్నించగా.. ఆయన చిరునవ్వు నవ్వి ఊరుకున్నారు. పరిటాల సునీతకు కూడా ఇదే ప్రశ్న ఎదురైంది. ఈ విషయం గురించి తాము కూడా పేపర్లు – టీవీల్లో చూడడం, బయట యువ‌త మాట్లాడుతుంటే విన్నామని తెలిపారు. అయితే మా ఆయన (ర‌వి) ఎవరికీ గుండు కొట్టించలేదని సునీత క్లారిటీ ఇచ్చారు. అసలు గుండు కొట్టించే వ్యక్తి పరిటాల రవి కానే కాదని, అంద‌రికీ సపోర్టు చేసే వ్యక్తేనని చెప్పారు. ఆయన ఎవర్నీ ఇబ్బంది పెట్టే వ్యక్తి కాదని – ఎవరో ఏదో అనుకుంటే మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

ఈ వ్యవహారంపై పవన్ బహిరంగంగా ఇటీవ‌ల స్పందించారు. మీడియా సాక్షిగా ఖండించారు. తనకు అప్పట్లో పరిటాల రవి అంటే ఎవరో తెలీదని – సినిమాలతో విసిగిపోయి తన ఇష్టప్రకారమే గుండు కొట్టించుకున్నానని క్లారిటీ ఇచ్చారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -