ఇటీవల జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ విశాఖ ఘటన తరువాత మంగళగిరిలో పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఎప్పుడు లేని విధంగా భూతులతో విరుచుకుపడ్డారు పవన్. వైసీపీ నేతలను ” కొడకల్లారా.. ” అంటూ తిట్లతో రెచ్చిపోయారు. అంతే కాకుండా తన మూడు పెళ్లిళ్లకు సంబంధించి కూడా పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తను మూడు పెళ్లిళ్లు చేసుకోవడానికి చాలానే కరణలున్నాయని.. తను చట్టప్రకారమే విడకులతో పాటు భరణం ఇచ్చిన తరువాతే మూడవ పెళ్లి చేసుకున్నానని పవన్ చెప్పుకొచ్చారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికి.. ” మీరు కూడా మూడు పెళ్లిళ్లు చేసుకోండి.. ఎవరు వద్దన్నారు ?..ఒక్క పెళ్లి చేసుకొని 30 మంది స్టేపీనిలతో తిరిగితే ఒకేనా .. ? ” అంటూ పవన్ వివాదాస్పద వ్యాఖ్యాలు చేశారు..
దీంతో పవన్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మహిళా కమిషన్ ఫైర్ అయ్యింది. మహిళలను కించపరిచేలా ” స్టేపీని ” అనడం ఆక్షేపనీయం అంటూ పేర్కొంది. మహిళలను కించపరిచేలా పవన్ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని ఏపీ మహిళా కమిషన్ చైర్మెన్ వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పవన్ కు నోటీసులు జారీ చేసింది మహిళా కమిషన్. ఇక పవన్ చేసిన వ్యాఖ్యలపై గత రెండు మూడు రోజులుగా వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. సిఎం జగన్ కూడా పవన్ కు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. దీంతో ఏపీ లో వైసీపీ వర్సస్ జనసేన రాజకీయం తారస్థాయిలో కొనసాగుతోంది. ఇక నుంచి తన భాష, మాటతీరు మార్చిన పవన్ కల్యాణ్.. మహిళా కమిషన్ ఇచ్చిన నోటీసులకు ఎలా రియాక్ట్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది.
ఇవి కూడా చదవండి
జగన్, బాబు కక్ష్య రాజకీయాలు.. ప్రజలకు తప్పని తిప్పలు !