Monday, April 29, 2024
- Advertisement -

పవన్‌కు అంత సీన్‌ లేదు:పోసాని

- Advertisement -

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఏపీఎఫ్‌డీసీ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి. విజయవాడలో మీడియాతో మాట్లాడిన పోసాని..రంగాను ప్రేమించిన వారు చంద్రబాబుకు ఓటేయరన్నారు. కాపులను మోసం చేసేందుకు పవన్, చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని…రంగాను చంపిందే చంద్రబాబు అని మరోసారి ఆరోపించారు పోసాని.

టీడీపీకి ఓటు వేయకపోడమే రంగాకు ఇచ్చే నిజమైన నివాళి అని..రంగా బ్రతికుంటే సీఎం అయ్యేవాడని తెలిపారు. ఎన్టీఆర్ కంటే రంగా గొప్ప నాయకుడన్నారు. పవన్ కల్యాణ్ వచ్చిందే కాపులను మోసం చేయడానికి అన్నారు. చంద్రబాబు, లోకేష్‌లను పచ్చి బూతులు తిట్టి..ఇప్పుడు అదే బాబుతో జతకట్టడాన్నారు.

అప్పుడేమో తానే సీఎం అవుతానని చెప్పి…ఇప్పుడు చంద్రబాబును సీఎం చేయాలని చెబుతున్నాడన్నారు. కాపులకు అండగా ఉంటానని ఇప్పుడు అదే కాపు ఓట్లతో చంద్రబాబును సీఎం చేయాలని చూస్తున్నాడన్నారు. రంగాని చంపినందుకు టీడీపీ ఓటేయాలా? ఆలోచించాలన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -