వైఎస్ జగన్ పాదయాత్ర గురించి ప్రకటించగానే, తెలుగుదేశం పార్టీ ఉలిక్కి పడింది. ‘పాదయాత్ర చేస్తే ముఖ్యమంత్రి అవుతారు..’ అన్న సెంటిమెంట్ తెలుగుదేశం పార్టీకే ఎక్కువ. అప్పటినుంచి జగన్పై బాబ,మంత్రుల,ఇతర నేతలు విమర్శల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే.
పాదయాత్ర కాదు కదా, తల్లకిందులుగా తపస్సు చేసినా జగన్ ముఖ్యమంత్రి అవలేరు..’ అంటూ టీడీపీ పైకి ఎన్ని కహానీలు విన్పించినా, తెరవెనుక జగన్ పాదయాత్రతో తమ రాజకీయ భవిష్యత్తు ఏమవుతుందన్న ఆందోళన మాత్రం టీడీపీ నేతల్ని వెంటాడుతూనే వుంది. తమ ఆందోళనని పైకి కనబడనీయకుండా పచ్చ నేతలు ‘మేకప్’ చేసుకుంటున్న తీరు అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.
తొలిరోజు వైఎస్ జగన్ పాదయాత్రని పెర్ఫెక్ట్గా ‘డిజైన్’ చేసి, వారెవ్వా అనిపించుకుంది వైఎస్సార్సీపీ. తొలి రోజు పాదయాత్ర సందర్భంగా జగన్ ‘అత్యుత్సాహం’ ఎక్కడా ప్రదర్శించలేదు. అన్ని వర్గాల ప్రజానీకం జగన్ పాదయాత్రలో కన్పించారు. జగన్, తన ట్రేడ్ మార్క్ ‘పలకరింపు’తో అందర్నీ ఎట్రాక్ట్ చేశారు.
బహిరంగ సభలో జగన్, అధికార పార్టీపై చేసే విమర్శలకు సమాధానం చెప్పలేక పార్టీ ఎదురుదాడి చేయడం తప్ప చేసిందేమిలేదు. ఇక మామూలుగా పాదయాత్రగురించి టీవీల్లో చర్చకార్యక్రమాలు షరా మామూలె. అక్కడా కూడా టీడీపీదీ ఒకే మాట సమాధానాలు చెప్పలేక ఎదురుదాడి చేయడం.
జగన్, 16 నెలలు జైల్లో ఎందుకు వున్నారో చెప్పాలి.. ఆ తర్వాతే పాదయాత్ర చేయాలి..’ అన్న ఒక్క మాటనే పట్టుకుని టీడీపీ నేతలు కొందరు విమర్శించడం మామూలె. మొత్తమ్మీద, తొలిరోజు పాదయాత్రతో జగన్, ‘ఇంపాక్ట్’ గట్టిగానే చూపించారనొచ్చు. ఇప్పుడే కదా, తొలి అడుగు పడింది. ఇక వేయబోయె అడుగులు అధికారపార్టీలో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో చూడాలి.