Sunday, May 19, 2024
- Advertisement -

ఉద్యోగాల భర్తీ పేరుతో కాలం గడుపుతున్నారు..!

- Advertisement -

టి.ఆర్.ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులను అనేక ఇబ్బందులకు గురి చేస్తోందని ఎమ్మెల్సీ రామచందర్​ రావు అన్నారు. నాగర్​కర్నూలు జిల్లా కొల్లాపూర్​లో బిజేపీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ సన్నాహక సమావేశం జరిగింది. ఉద్యోగాల భర్తీ పేరుతో కాలం గడుపుతున్నారని విమర్శించారు. ఉద్యోగాలు భర్తీ చేశామని మాటలు చెప్పడం కాకుండా… చేసి చూపించాలని హితవు పలికారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉంటున్నట్టు రామచందర్​ రావు స్పష్టం చేశారు. నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతానని తెలిపారు. ఈ సమావేశానికి బిజేపి జిల్లా అధ్యక్షుడు ఎలేని సుధాకర్​ రావు, బిజేపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్ కుమార్​ రావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

‘లైగ‌ర్‌’లో దుమ్ము లేపుతున్న అన‌న్య

కోటి వృక్షార్చన మొదలైనట్టే.. మొదట ఎవరంటే..!

హైదరాబాద్ లో అల్లు అర్జున్ ’పుష్ప’

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -