జనసేనాని పవన్ కల్యాణ్ ఈ ఉదయం పెట్టిన ఓ ట్వీట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎప్పుడూ లేని విధంగా ఎంతో ఆగ్రహంతోనే ఇలాంటి ట్వీట్ పెట్టారంటున్న రాజకీయ నిపుణులు. ఇది టీడీపీపై తీవ్ర ప్రభావం చూపుతుందనడంలో సందేహంలేదు. దీంతో బాబు,పవన్మధ్య దూరం పెరిగిందనె చెప్పాలి.
ఎజెండా, జెండాలేని పవన్ గురించి ఆలోచించే తీరిక, సమయం తనకు లేవని మంత్రి పితాని చేసిన వ్యాఖ్యలను, గతంలో కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసుకుంటూ వపన్ ట్విట్టర్లో స్పందించారు. ఇప్పటికె వచ్చె ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తానని పవన్ ప్రకటించారు.
దీనిలో భాగంగానె ఈ ట్వీట్ చేశారనె వార్తలు వినిపిస్తున్నాయి. వారికి తానెవరో తెలియదు, సంతోషమని పవన్ పెట్టిన ట్వీట్ ను విశ్లేషిస్తున్న రాజకీయ నిపుణులు, టీడీపీతో తెగతెంపులు చేసుకోవాలని నిర్ణయం తీసుకున్న తరువాతనే ఆయనిలాంటి ట్వీట్ చేసుంటారని అంచనా వేస్తున్నారు. ఒక్క ట్వీట్ తో ఆయన తన వైఖరిని స్పష్టం చేశారని, తన బలాన్ని తక్కువగా అంచనా వేస్తున్నారంటూ హెచ్చరికలు జారీ చేసుంటారనె వార్తలు వినిపిస్తున్నాయి.
2014 ఎన్నికల్లో ప్రచారానికి తనను వాడుకుని, ఇప్పుడు తానెవరో తెలియదంటూ మంత్రులు చేసిన వ్యాఖ్యలపై ఎంత ఆగ్రహంగా ఉండకపోతే, పేర్లను ప్రస్తావిస్తూ మరీ పవన్ వ్యంగ్యాస్త్రాన్ని వదులుతూ కామెంట్ చేసుంటాడని విశ్లేషిస్తున్నారు. స్వయంగా మంత్రులు పవన్ గురించి మాట్లాడుతుంటే, అవి కాస్తంత గట్టిగానే తగిలాయని, అందుకే ఆయనలా స్పందించాడని చెబుతున్నారు. ఇక పవన్ తాజా ట్వీట్ పై తెలుగుదేశం నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.