దేశంలో కరోనా వచ్చినప్పటి నుంచి రాజకీయ నేతలను టార్గెట్ చేసినట్టే ఉంది. ఇప్పటికే పలువురి ముఖ్య నేతలకు కరోనా రావడం… కన్నుమూయడం కూడా జరిగింది. తాజాగా టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఈ మేరక ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా ప్రజలకు విషయాన్ని తెలియజేశారు.
ఈ రోజు నేను కోవిడ్ టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. ఆరోగ్యంగానే ఉన్నాను..హోం క్వారంటైన్ లో విశ్రాంతి తీసుకుంటున్నాను. ఇటీవల నన్ను కలిసినవారందరూ తగు జాగ్రత్తలు తీసుకోగలరు. అంటూ ఆయన ట్వీట్ చేశారు.
కాగా, ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,83,587కి చేరింది. ఇందులో 8,73,427 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 3,038 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా నాలుగు మరణాలు సంభవించాయి. దేశంలో ఈ మద్య కొత్త కరోనా వైరస్ మరింత భయపెడుతున్న విషయం తెలిసిందే.