టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నిత్యం వైసీపీ అధినేత జగన్మీద విమర్శలు చేయడం ఆయన దినచర్యగా మారింది. ఇప్పుడు తాజాగా మరో సారి జగన్పై జేసీ విమర్శలు ఎక్కుపెట్టారు. జగన్ కు పొద్దున్న లేచినప్పటి నుంచి చంద్రబాబును విమర్శించడమే పని అని మండిపడ్డారు. ఒక పార్టీకి నాయకుడిగా ఓట్లు సంపాదించుకోవాలనుకోవడంలో తప్పు లేదని… ఇదే సమయంలో ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా జగన్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
కరువుసీమ రాయలసీమకు చంద్రబాబు నీరు ఇస్తుంటే… రాయలసీమకు నీరు ఎలా ఇస్తారని, పల్నాడుకు ఇవ్వాలనే విధంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ కు పోయే కాలం దగ్గరపడిందని అన్నారు. పల్నాడుకు నీరు కావాలనే స్లోగన్ ను అంబటి రాంబాబు ద్వారా చెప్పిస్తున్నారని మండిపడ్డారు. ఇది అత్యంత దారుణమని… సీమకు నీళ్లివ్వకుండా, ఇప్పటికే అభివృద్ధి చెందిన ప్రాంతాలకు ఇంకా దోచి పెట్టాలా? అని నిలదీశారు. ఓట్ల కోసం పుట్టిన గడ్డకు కూడా అన్యాయం చేసేందుకు జగన్ వెనుకాడటం లేదని మండిపడ్డారు. జగన్ దృష్టి అంతా సీఎం పదవి మీదే ఉందని చెప్పారు
ఏపీ సీఎం చంద్రబాబు గొప్ప నాయకుడని, పరిపాలనా దక్షుడని జేసీ కొనియాడారు. తాను కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కూడా అనేక విషయాల్లో చంద్రబాబుతో ఏకీభవించానని చెప్పారు. తినటానికి తిండి, తాగడానికి నీరు కూడా లేని అనంతపురం జిల్లాకు నీరు ఇస్తూ సస్యశ్యామలం చేశారన్నారు… దీనికి అనంతపురం జిల్లా ప్రజలంతా చంద్రబాబుకు రుణపడి ఉంటారని చెప్పారు. జేసీకి ఎప్పుడు మూడు వస్తె అప్పుడు జగన్పై విమర్శలు చేయడం ఆయనకు అలవాటెకదా.