Saturday, May 25, 2024
- Advertisement -

టీడీపీ నుంచి ఎమ్మెల్యే మేడా సస్పెండ్

- Advertisement -

ఏపీలో ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్ది పార్టీలు మారే నాయ‌కులు ఎక్కువైయ్యారు. ఇటీవ‌లే వైసీపీ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేర‌డానికి రెడీ అయ్యారు విజ‌య‌వాడ మాజీ ఎమ్మెల్యే వంగ‌వీటి రాధా. తాజాగా మ‌రో ఎమ్మెల్యే పార్టీ మారేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. కడ‌ప జిల్లా రాజంపేట శానససభ్యుడు మేడా మల్లికార్డున్ రెడ్డి వైసీపీ కండువ క‌ప్పుకునేందుకు సిద్దం చేసుకున్నారు. గ‌త కొంత‌కాలంగా టీడీపీలో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు మేడా. పైగా మంత్రి ఆదినార‌య‌ణ రెడ్డితో విభేదాలు కూడా పార్టీ మారేంద‌కు ఓ కార‌ణంగా తెలుస్తోంది.

మంగ‌ళ‌వారం సాయంత్రం మేడా మల్లికార్డున్ రెడ్డి , వైఎస్ జ‌గ‌న్‌తో భేటీ కానున్నార‌ని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మేడా మల్లికార్డున్ రెడ్డిను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు. దీంతో మేడా వైసీపీలో చేర‌డం ఖ‌యం అయిపోయింది. మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలనున్నారు మల్లికార్డున్ రెడ్డి. అయితే మేడాకు సీటు విషయంలో జ‌గ‌న్ ఎటువంటి ప్ర‌తిపాద‌న ఇస్తారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -