మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణపై ఎన్నికల కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. బలవంతపు ఉపసంహరణలపై కొన్ని పార్టీల నుంచి ఫిర్యాదులు వచ్చాయనీ.. బలవంతపు ఉపసంహరణలకు అంగీకరించవద్దని ఎస్ఈసీ స్పష్టం చేసింది. ఈ రగడ ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కూడా జరిగాయి.
ఏపిలో అధికార పార్టీ ప్రతి పక్ష పార్టీల మద్య ఇటీవల కాలంలో ఆదిపత్య పోరు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే అధికార పార్టీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో అత్యధిక సీట్లు కైవసం చేసుకుంది. త్వరలో జరిగే ఎన్నికల్లో అయినా ప్రతిపక్ష పార్టీ తన ఉనికి కాపాడుకునేందుకు ఎన్నో పాట్లు పడుతుంది.
ఉపసంహరణ నోటీసులను యాంత్రికంగా అనుమతించవద్దనీ.. ప్రక్రియను వీడియో చిత్రీకరణ చేయాలని ఆదేశించింది. మూడో పక్షం నుంచి ఉపసంహరణలను అంగీకరించవద్దని ఉత్తర్వులిచ్చింది. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని.. కలెక్టరు, ఎన్నికల అధికారులను ఆదేశించింది.
వామ్మో.. రాణికెట్ వ్యాధితో 4వేల నాటుకోళ్లు మృతి!