ఆంధ్రప్రదేశ్లో నియోజక వర్గాలు పెంపు ఉంటుందని చంద్రబాబు ఫిరాయింపులను ప్రోత్సహించారు. ఆయను నమ్మి ఇప్పటికే వైసీపీనుంచి అనేకమంది నేతలు ఫిరాయించారు. వారి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో వారే తమ బాధను వెల్లగక్కుతున్నారు. నియోజవ వర్గాల విభజన లేదని తేలిపోవడంతో టీడీపీ వైపు చూసిన చాలా నేతలు ఇప్పుడు వైసీపీ వైపు చూస్తున్నారు.
ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో గతంలో మంత్రులుగాఒక వెలుగు వెలిగి, బలమైన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు వైసీపీలోకి వచ్చేందుకు తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. వారిలో డీఎల్ రవీంద్రారెడ్డి, మాగంటి మహీధర్రెడ్డి, కొండ్రుమొరళీ తదితరులు వైసీపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు.
మగ్గురు మంత్రులతోపాటు పాటు వైసీపీ అధినేత జగన్ దృష్టికి కూడా కొందరు టీడీపీ, కాంగ్రెస్ నేతల జాబితా చేరింది. వారు చేరేందుకు ఉత్సాహం చూపుతున్నట్లు తేలింది. అయితే ఈ జాబితాను ప్రశాంత్ కిషోర్ టీం కు అప్పగించినట్లు సమాచారం. పార్టీలోకి వచ్చే నేతల గురించి వారి నియోజకవర్గాల్లో ప్రజల మద్దతు ఎలా ఉంది,టికెట్ ఇస్తే గెలుస్తారా అన్న సమాచారం సేకరిస్తోంది పీకేటీం. రాబోయో రోజుల్లో వలసలు మరింత ఊపందుకోనున్నాయి.