Friday, April 26, 2024
- Advertisement -

నేడు నగరానికి బిజేపి పెద్ద తల.. ఎన్నికల మాయ..!

- Advertisement -

గత కొంత కాలంగా తెలంగాణలో బీజేపీ ఆదిపత్యాన్ని కొనసాగించే దిశగా సాగుతుంది. తెలంగాణలో ఇటీవల జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ మంచి సీట్లే రాబట్టింది. వచ్చే ఎన్నికల్లో మరింత బలోపేతం చేసుకోవడానికి వ్యూహాలు రచిస్తున్నారు. బిజేపి తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జ్ తరుణ్‌ చుగ్‌ నేటి నుంచి మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు.

పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో కలిసి కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లాకు వెళ్లనున్నారు. సిర్పూర్‌ కాగజ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొననున్నారు.. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పాల్వాయి హరీశ్, తరుణ్‌ చుగ్‌ సమక్షంలో పార్టీలో చేరనున్నారు.

రెండో రోజు తరుణ్ ​చుగ్ పార్టీ ముఖ్య నేతలతో​ సమావేశం కానున్నారు. వారితో.. పార్టీ బలోపేతం, చేరికలు, పట్టభద్రుల, కార్పొరేషన్ ఎన్నికలు, రాష్ట్ర రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చించ నున్నట్లు తెలుస్తోంది. మూడో రోజు పర్యటనలో నాగార్జున సాగర్​లో జరిగే సమావేశంలో పాల్గొననున్నారు. ఉప ఎన్నికలో విజయంపై.. నేతలకు దిశానిర్థేశం చేయనున్నట్లు సమాచారం.

ఎన్టీఆర్ తో త‌ల‌బ‌డుతున్న విజ‌య్ సేతుపతి !

లంక టీమ్ కి షాక్ ఇచ్చిన చమిందా వాస్‌.. కోచ్ ప‌ద‌వికి వాస్ రాజీనామా!

రికార్డ్ స్థాయిలో పెరిగిన భాగ్యనగర పెట్రోల్ ధరలు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -