Monday, May 6, 2024
- Advertisement -

రెండు స్థానాల్లోనూ గెలుపు ఖాయం..!

- Advertisement -

గత కొంత కాలాంగా తెలంగాణలో బీజేపీ తన ప్రతాపాన్ని చూపిస్తుంది. గత ఎన్నికల్లో పెద్దగా రాణించలేకపోయినా.. ఇటీవల జరుగుతున్న ఎన్నికల్లో సత్తా చాటుతూ వస్తుంది. ఇటీవల జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గత ఎన్నికలకన్నా నాలుగు రెట్లు ఎక్కువ స్థానాలు కైవసం చేసుకుంది. తాజాగా త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాల్లోనూ బిజేపి గెలవడం ఖాయమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్​ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

హామీల అమలులో టిఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. నిధులు, నియామకాలు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. ఖైరతాబాద్​లోని సరస్వతీ విద్యామందిర్ పాఠశాలలో జరిగిన ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ముఖ్యమంత్రి పదవి చెప్పుతో పోల్చిన కేసీఆర్​… రాజ్యాంగాన్ని, ఓటు హక్కును అవమానించారన్నారు.

తెరాస నిజస్వరూపం ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుందని… బిజేపి పట్ల అనుకూలత పెరుగుతోందని పేర్కొన్నారు. జీహెచ్​ఎంసీ ఎన్నికల ప్రచారంలో మజ్లీస్​తో పొత్తు లేదని చెప్పి… అదే పార్టీ సాయంతో మేయర్​, ఉపమేయర్​ పదవులు పొందారని విమర్శించారు.

షేక్ పేటకు చేరుకున్న మృతదేహాలు.. మొత్తం విషాదం..!

కృతి శెట్టి గురించి మీకు తెలియని విష‌యం ఇది!

ఈనెల 17న ఒక్క గంటలో ఇదే పనిలో ఉండాలి..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -