ఆడబిడ్డల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత – ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. విజయనగరంలో అంగన్వాడీ వర్కర్లపై లాఠీఛార్జ్ను జగన్ ఖండించారు. మహిళలపై దాడులు జరగడం అమానుషమన్నారు.
ప్రజా సంకల్పయాత్రలో ఉన్న వైఎస్ జగన్ ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఓ వైపు మహిళా సాధికారిత అని మాట్లాడుతూ… మరోవైపు మహిళలపై దాడి చేయడం అమానుషమని ఆయన అన్నారు. తెలంగాణలో అంగన్వాడీ వర్కర్లకు జీతాలు పెంచారని, ఏపీలో పెంచకపోవడం మీకు సిగ్గుగా లేదా? అంటూ వైఎస్ జగన్ ట్విటర్ వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ట్విట్ చేశారు. తెలంగాణా సీఎం కేసీఆర్ను చూసౌనా నేర్చుకోవాలని హితవు పలికారు.
Strongly condemn brutal lathi charge on Anganwadi workers agitating for their rights at Vizianagram. @ncbn, you speak of women empowerment, yet you resort to oppressive measures against them. Aren’t you ashamed of failing to provide them with enhanced wages, as done in Telangana?
— YS Jagan Mohan Reddy (@ysjagan) April 24, 2018