Saturday, May 18, 2024
- Advertisement -

సీఎం కేసీఆర్ ఇలాకాలో వైఎస్ షర్మిల పర్యటన.. వెంకటేశ్ యాదవ్ కుటుంబానికి పరామర్శ!

- Advertisement -

నేడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సం.. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. వెన్నుచూపని ధైర్యంతో, మొక్కవోని సంకల్పంతో పోరాడి 4 కోట్ల ప్రజల ఆకాంక్ష నెరవేర్చుకున్న రోజు. ప్రత్యేక రాష్ట్రం సిద్దించిన రోజు. రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు… అంటూ ఆమె తన సందేశంలో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేళ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇలాకాలో పర్యటిస్తున్నారు.

షర్మిల పర్యటన కోసం ఆమె అనుచరులు, అభిమానులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. వెల్దుర్తి మండలంలోనీ శేరిల్ల గ్రామంలో నోటిఫికేషన్ లేక ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి వెంకటేశ్ యాదవ్ కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. బీఈడీ చదివి టీచర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ పడకపోవడంతో వెంకటేష్ బలవన్మరణానికి పాల్పపడ్డ విషయం తెలిసిందే. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా కేసీఆర్ ప్రభుత్వంపై షర్మిల తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున ఆమె గజ్వేల్ పర్యటన ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో పార్టీ ఏర్పాటు పెడతానని ప్రకటించిన ఆమె జిల్లాల వారీగా వైయస్ అభిమానులతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. కాగా, గజ్వేల్ పర్యటన తర్వాత హైదరాబాద్ తిరిగొచ్చి అమరవీరుల స్థూపం (గన్ పార్కు) వద్ద నివాళులు అర్పించనున్నారు. ఈ మేరకు షర్మిల కార్యాలయం ఓ ప్రకటన చేసింది.

తెలంగాణ అమరులకు నివాళులర్పించిన సీఎం కేసీఆర్…

ఉత్తర ప్రదేశ్ ఘోరం.. గ్యాస్ సిలిండర్ పేలి ఏడుగురు మృతి

సంచలన నిర్ణయం తీసుకున్న నటి శ్రియా..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -