వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్తులకు గట్టి షాక్ ఇచ్చేందుకు జగన్ ప్రయత్నాలు ప్రారంభించారు. అన్ని నియోజక వర్గాల్లోను బలమైన సామాజిక, ఆర్థికంగా ఉన్న నాయకులపై దృష్టి సారించారు. తాజాగా చింతలపూడి నియేజక వర్గంపై దృష్టి సారించారు. అక్కడ అధికారపార్టీ ఎమ్మెల్యే బలమైన అభ్యర్తి పీతల సుజాతను ఢీకొట్టేందుకు జగన్ మహిళా అస్త్రాన్నిప్రయేగించనున్నారు.
గత ఎన్నికల్లో కూడా వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే మద్దాల రాజేష్కుమార్ భార్య మద్దాల దేవీప్రియను పోటీ చేయించగా సుజాత చేతిలో ఆమె ఓటమి పాలయ్యారు. తర్వాత దయ్యాల నవీన్బాబును జగన్ సమసన్వయకర్తగా నియమించారు. పీతల సుజాతను ఢీ కొట్టాలంటే ఆర్థికంగా ఇంకా బలమైన క్యాండెట్ అవసరమని భావించిన జగన్ నవీన్బాబును తప్పించి ఆ ప్లేస్లో దమ్ము సుహాసినికి చింతలపూడి వైసీపీ సమన్వయకర్త బాధ్యతలు అప్పగించారు.
దమ్ము సుహాసిని కర్ణాటక కేడర్కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి స్వతంత్రరావు కుమార్తె దమ్ము సుహాసినిని ఇక్కడ నుంచి బరిలోకి దింపాలని డిసైడ్ అయ్యి ఆమెకు బాధ్యతలు అప్పగించారు. ఆమె భర్త దమ్ము మురళీధర్రావు కూడా హైదరాబాద్లో సివిల్ సర్వెంట్గా పని చేస్తున్నారు. చింతలపూడి నియోజకవర్గం రిజర్వ్ కావడంతో జగన్ ముందుచూపుతో దమ్ము సుహాసినిని చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. వచ్చే ఎన్నికల్లో తాను రూ.20 కోట్లు సొంతంగా ఖర్చు చేస్తానని జగన్కు హామీ ఇచ్చారంట. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న పీతల సుజాతకు ఎంత మేరకు గట్టి పోటీ ఇస్తుందో చూడాలి.