- Advertisement -
ప్రభుత్వ చేపట్టే పథకాలపై బడుగు బలహీన వర్గాల్లో అవగాహన కల్పించడమే లక్ష్యంగా సామాజిక న్యాయభేరీ బస్సు యాత్రకు వైసీపీ శ్రీకారం చుట్టింది. శ్రీకాకుళం జిల్లా నుంచి మొదలైన ఈ యాత్ర పలు జిల్లాల్లో సాగనుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన మొత్తం 17 మంది మంత్రులు ఈ యాత్రలో పాల్గొంటున్నారు.
తొలిరోజు శ్రీకాకుళంలోని ఏడు రోడ్ల కూడలి లో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి యాత్ర ప్రారంభించారు. నాలుగు రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. విజయనగరం, రాజమహేంద్రవరం, నరసరావుపేట, అనంతపురం జిల్లాల్లో మంత్రులు బహిరంగ సభలు నిర్వహించనున్నారు.
సీనియర్ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ సహా మొత్తం 17 మంది మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
ఆత్మకూర్ ఉప ఎన్నికల ఎప్పుడంటే ?